జగదేవపూర్‌ మండలంలో దారుణం.. పొదల్లోకి తీసుకెళ్లి..

జగదేవపూర్‌ మండలంలో దారుణం.. పొదల్లోకి తీసుకెళ్లి..
x
Highlights

సిద్దిపేట జిల్లా జగదేవపూర్‌ మండలంలో దారుణం జరిగింది. రాయవరం గ్రామానికి చెందిన ఓ 16 ఏళ్ల బాలికపై ఆరుగురు దుర్మార్గులు అత్యాచారానికి పాల్పడ్డారు....

సిద్దిపేట జిల్లా జగదేవపూర్‌ మండలంలో దారుణం జరిగింది. రాయవరం గ్రామానికి చెందిన ఓ 16 ఏళ్ల బాలికపై ఆరుగురు దుర్మార్గులు అత్యాచారానికి పాల్పడ్డారు. నాలుగు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలిక ఆమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. ఈ కేసులో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరొకరి కోసం గాలిస్తున్నారు.

గజ్వేల్‌కు చెందిన యువకులు రాయవరం గ్రామానికి చెందిన మైనర్ బాలికతో కొంతకాలంగా స్నేహం పెంచుకున్నారు. తరచూ ఫోన్‌లో మాట్లాడుతూ ఆమెకు మాయమాటలు చెప్పి బయటకు తీసుకొచ్చారు. పొదల్లోకి తీసుకెళ్లి ఆరుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను కొడకండ్ల గ్రామం వద్ద వదిలేశారు. బాలిక కోసం వెతుకుతున్న కుటుంబీకులకు ఆమె కొడకండ్లలో కనిపించింది. వెంటనే బాలికను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న దళిత సంఘాలు ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు ఈ కేసులో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 5 సెల్ ఫోన్లు, 2 బైక్లు, బాధితురాలి చెవి కమ్మలు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసిన వారిని రిమాండ్‌కు తరలించామని పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నామని చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories