సూర్యాపేట జిల్లాలో సర్పంచి పంచాయితీ!!

సూర్యాపేట జిల్లాలో సర్పంచి పంచాయితీ!!
x
Highlights

సూర్యాపేట జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. కోదాడ మండలం బీక్యా తండాలో సర్పంచ్ ప్రమాణస్వీకారంలో ఉద్రిక్తతకు దారితీసింది. తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా...

సూర్యాపేట జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. కోదాడ మండలం బీక్యా తండాలో సర్పంచ్ ప్రమాణస్వీకారంలో ఉద్రిక్తతకు దారితీసింది. తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా టీఆర్‌‌ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు ఇద్దరికీ 476 ఓట్లు రావడంతో ఎన్నికల అధికారి టాస్ వేసి కాంగ్రెస్ అభ్యర్థిని విజేతగా ప్రకటించారు.

అయితే, ఆ సమయంలో టాస్ పడిన కాయిన్ చూపించకుండా కాంగ్రెస్‌ అభ్యర్థిని ప్రకటించడాన్ని టీఆర్‌ఎస్ అభ్యర్థి అడ్డుకున్నారు. దీంతో ఎన్నికల నియమావళి ప్రకారం మరోసారి టాస్ వేసేందుకు అధికారులతో చర్చిస్తామని చెప్పి వెళ్లిపోయారు. ఇవాళ కాంగ్రెస్ అభ్యర్థి సర్పంచ్‌గా ప్రమాణస్వీకారానికి సిద్ధపడటంతో వివాదం మొదలైంది. ఫలితం తేలకుండా ప్రమాణస్వీకారం చేస్తే ఒప్పుకోనని, టీఆర్‌ఎస్ అభ్యర్థి పంచాయితీకి తాళం వేసి కిరోసిన్ పోసుకుంటానంటూ బెదిరించాడు. దీంతో ఆ గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు సర్పంచ్ ప్రమాణస్వీకారాన్ని ఉన్నతాధికారుల ఆదేశం మేరకు వాయిదా వేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories