రాజకీయ మలుపు తీసుకున్న శబరిమల అంశం

రాజకీయ మలుపు తీసుకున్న శబరిమల అంశం
x
Highlights

శబరిమల అంశం పూర్తిగా రాజకీయ మలుపు తీసుకుంది. ఆలయంలోకి మహిళలను రానీయకుండా బీజేపీ తన నిరసనను తీవ్రతరం చేస్తున్న నేపథ్యంలో కేరళ ప్రభుత్వం కౌంటర్ ఎటాక్‌కు దిగింది.

శబరిమల అంశం పూర్తిగా రాజకీయ మలుపు తీసుకుంది. ఆలయంలోకి మహిళలను రానీయకుండా బీజేపీ తన నిరసనను తీవ్రతరం చేస్తున్న నేపథ్యంలో కేరళ ప్రభుత్వం కౌంటర్ ఎటాక్‌కు దిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ సుప్రీంకోర్టు తీర్పును అమలు చేసే దిశగా మద్దతు కోసం ప్రయత్నాలు చేసింది. ఇందులో భాగంగా ఈ రోజు లక్షలాది మంది మహిళలతో గ్రేట్ వాల్ ఆఫ్ కేరళ పేరిట భారీ ర్యాలీని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు కేరళ సీఎం పినరయి విజయన్ వెల్లడించారు.

రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతుగా గ్రేట్ వాల్ ఆఫ్ కేరళ అనే నినాదంతో లక్షలాది మహిళలు ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తున్నారు. కసర్ గోడ్‌ నుంచి తిరువనంత పురం వరకు 650 కిలోమీటర్ల వరకూ ఈ నిరసన ర్యాలీని చేపట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories