సీబీఐ కొత్త డైరెక్టర్‌గా రిషికుమార్‌ శుక్లా

సీబీఐ కొత్త డైరెక్టర్‌గా రిషికుమార్‌ శుక్లా
x
Highlights

సీబీఐ నూతన డైరెక్టర్‌గా రుషి కుమార్ శుక్లా నియమితులయ్యారు. రుషి మధ్యప్రదేశ్ కేడర్ 1983 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ఆయన రెండేళ్ళపాటు ఈ పదవిలో కొనసాగుతారు....

సీబీఐ నూతన డైరెక్టర్‌గా రుషి కుమార్ శుక్లా నియమితులయ్యారు. రుషి మధ్యప్రదేశ్ కేడర్ 1983 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ఆయన రెండేళ్ళపాటు ఈ పదవిలో కొనసాగుతారు. ప్రధాన మంత్రి నేతృత్వంలోని ఎంపిక కమిటీ రుషిని ఎంపిక చేసింది.

సీబీఐ చీఫ్ ఎంపిక నిన్న జరగాల్సి ఉండగా ఇవాళ్టికి వాయిదా వేసిన కమిటీ తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. మొత్తం ఐదుగురు సీనియర్ ఐపీఎస్ అధికారుల్లో నుంచి రిషి కే శుక్లాను ఎంపిక చేశారు. సీబీఐ కొత్త డైరెక్టర్ నియామకం వెనుక చాలా పెద్ద కసరత్తు జరిగింది. తొలిదశలో 1983 - 1985 బ్యాచ్ అధికారుల్లో మొత్తం 80 మంది పేర్లను పరిశీలించారు. అందులో నుంచి మొత్తం 30 మందిని 'సెమీ ఫైనల్‌'కు ఎంపిక చేశారు. వారి సీనియారిటీ, ట్రాక్ రికార్డు వంటి వాటిని పరిగణనలోకి తీసుకున్న తర్వాత అందులో నుంచి 25 మంది పేర్లను తొలగించి కేవలం ఐదుగురిని ఫైనల్ లిస్టులో చేర్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories