అమర జవాన్లకు హోంమంత్రి రాజ్‌నాథ్‌ నివాళి

అమర జవాన్లకు హోంమంత్రి రాజ్‌నాథ్‌ నివాళి
x
Highlights

జమ్మూ కాశ్మీర్ లోని బద్గామ్ లో అమర జవాన్లకు కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ నివాళులర్పించారు. రాజ్ నాథ్ సింగ్ తో పాటు జమ్ము కాశ్మీర్ గవర్నర్ సత్యపాల్...

జమ్మూ కాశ్మీర్ లోని బద్గామ్ లో అమర జవాన్లకు కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ నివాళులర్పించారు. రాజ్ నాథ్ సింగ్ తో పాటు జమ్ము కాశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ కూడా అమరులైన జవాన్లకు నివాళులర్పించారు. పుల్వామాలో సీఆర్పీఎఫ్‌ కాన్వాయ్‌పై జరిగిన ఉగ్రదాడి ఘటనలో 49 మంది జవాన్లు వీరమరణం పొందారు. సీఆర్పీఎఫ్‌ జవాన్ల పార్థివదేహాలకు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. కేంద్ర హోంమంత్రితో పాటు జమ్మూకశ్మీర్‌ గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌, ఆర్మీ నార్తన్‌ కమాండ్‌ చీఫ్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ రణబీర్‌ సింగ్‌ నివాళులర్పించారు. పూర్తిగా సైనిక లాంఛనాలతో వీర జవాన్లకు వీడ్కోలు పలికారు. వీర్‌ జవాన్‌ అమర్‌ రహే అంటూ నినదించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories