ఆమ్ ఆద్మీ తరపున ప్రకాశ్ రాజ్ ప్రచారం

ఆమ్ ఆద్మీ తరపున ప్రకాశ్ రాజ్ ప్రచారం
x
Highlights

ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ ఆమ్ ఆద్మీ తరపున ప్రచారం చేయనున్నారు. రేపటి నుంచి మే 10 వరకు ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో ప్రచారం చేయనున్నారు. దక్షిణాది...

ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ ఆమ్ ఆద్మీ తరపున ప్రచారం చేయనున్నారు. రేపటి నుంచి మే 10 వరకు ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో ప్రచారం చేయనున్నారు. దక్షిణాది ఓటర్లు అధికంగా ఉన్న ప్రాంతాలలో ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు. పలు ప్రాంతాల్లో పాదయాత్రలు చేయనున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ విధి విధానాలు నచ్చడంతోనే ప్రచారానికి వచ్చానని ప్రకాశ్ రాజ్ తెలిపారు. కేంద్రంలో రాబోయేది సంకీర్ణ ప్రభుత్వమేనని ప్రకాశ్ రాజ్ అన్నారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆమ్ ఆద్మీ పార్టీ తరుపున ప్రచారం చేస్తానన్నారు. ఢిల్లీలో కేజ్రీవాల్ చేసిన అభివృద్ది కనిపిస్తోందన్నారు. ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం పెరుగుతోందన్నారు. అభివృద్ది చేసే వారిని గెలిపించేందుకు కృషి చేస్తానన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories