రోహిత్ ని కెప్టైన్ చేయండి: నేటిజన్స్

రోహిత్ ని కెప్టైన్ చేయండి: నేటిజన్స్
x
Highlights

జరిగిన ఐపిఎల్ సీజన్లో ముంబై ఇండియాన్స్ కి నాలుగో సారి కప్పు తెచ్చిపెట్టిన ముంబై ఇండియాన్స్ కెప్టైన్ రోహిత్ శర్మకి ఇండియన్ టీం పగ్గాలు అప్పజెప్పాలని...

జరిగిన ఐపిఎల్ సీజన్లో ముంబై ఇండియాన్స్ కి నాలుగో సారి కప్పు తెచ్చిపెట్టిన ముంబై ఇండియాన్స్ కెప్టైన్ రోహిత్ శర్మకి ఇండియన్ టీం పగ్గాలు అప్పజెప్పాలని ట్విట్టర్ వేదికగా నేటిజన్స్ కోరుతున్నారు . ధోని తరువాత రోహితే ఇండియన్ టీం కి బెస్ట్ కెప్టన్ అని నేటిజన్స్ అభిప్రాయ పడుతున్నారు .

2009 లో గిలిక్రిస్ట్ నాయకత్వంలో తొలిసారి ఐపిఎల్ కప్పును ముద్దాడిన రోహిత్ అ తర్వాత ముంబై ఇండియాన్స్ కి పగ్గాలు అందిపుచ్చుకొని 2013లో తన జట్టుకు మొదటిసారి ట్రోఫీని అందించాడు. తర్వాత 2015లో ముంబైకి టైటిల్ అందించిన హిట్ మ్యాన్.. 2017, 2019ల్లో ఉత్కంఠగా సాగిన ఫైనల్ మ్యాచ్‌ల్లో ఒక్క పరుగు తేడాతో తన జట్టును విజేతగా నిలిపాడు.

ధోనీ తర్వాత భారత్‌కు మెరుగైన కెప్టెన్ రోహితేనని గతంలో సెహ్వాగ్ చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. కోహ్లి కంటే బెటర్ బ్యాట్స్‌మెన్, ధోనీ కంటే బెటర్ కెప్టెన్ అతడంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. ఈ సీజన్ లో చెన్నై పై ఆడినా నాలుగు మ్యాచ్ లోను ముంబైదే పై చేయి .. రోహిత్ మరోసారి తనేంటో ఫ్రూవ్ చేసుకున్నాడు. కానీ బీసీసీఐ పట్టించుకోవడం లేదని మరో నెటిజన్ ట్వీట్ చేశాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories