ఏపీలో ప్రచారవేడి రగిల్చిన ప్రధాని...టీడీపీ తీరును తీవ్రస్ధాయిలో విమర్శిస్తూ తెలుగులో ట్వీట్‌

ఏపీలో ప్రచారవేడి రగిల్చిన ప్రధాని...టీడీపీ తీరును తీవ్రస్ధాయిలో విమర్శిస్తూ తెలుగులో ట్వీట్‌
x
Highlights

ఏపీలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఎన్నికల ప్రచార వేడి రగిల్చారు. తనను టార్గెట్‌ చేస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై...

ఏపీలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఎన్నికల ప్రచార వేడి రగిల్చారు. తనను టార్గెట్‌ చేస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై ట్విటర్ వేదికగా విమర్శలు గుప్పించారు. ఏపీలో ఎన్నికల ప్రచారాన్ని తెలియజేస్తూ టీడీపీ తీరుపై తీవ్ర స్ధాయిలో విమర్శలు గుప్పించారు. ఎన్టీఆర్‌‌ ఆదర్శాలకు నీళ్లొదిలారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి, బలహీనమైన పాలనతో ఏపీ తిరోగమనంలో ఉందన్న ప్రధాని యువత కలలు నెరవేర్చేందుకే ఏపీ పర్యటనకు వస్తున్నట్టు ప్రకటించారు. ఆంధ్ర ప్రదేశ్‌ ప్రజల ఆశీస్సులు కోరుతున్నానంటూ ప్రధాని ట్వీట్ చేశారు. ట్వీట్ ద్వారా తన పర్యటన ఉద్దేశం తెలియజేసిన ప్రధాని బహిరంగ సభలో ఏయే అంశాలపై మాట్లాడుతారనేది ఆసక్తిగా మారింది.


Show Full Article
Print Article
Next Story
More Stories