ఒక్క మిస్డ్‌కాల్‌తో ఆమె ప్రాణమే పోయింది..

ఒక్క మిస్డ్‌కాల్‌తో ఆమె ప్రాణమే పోయింది..
x
Highlights

తెలిసి తెలియక పొరపాటుగా ఒకరికి ఫోన్ కాల్‌తో మరొకరు పరిచయం అయ్యారు. ఇక ఈ ఫోన్ కాల్ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఇదే క్రమంలోనే తనను...

తెలిసి తెలియక పొరపాటుగా ఒకరికి ఫోన్ కాల్‌తో మరొకరు పరిచయం అయ్యారు. ఇక ఈ ఫోన్ కాల్ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఇదే క్రమంలోనే తనను పెళ్లిచేసుకోవాలంటూ పదే పదే ప్రస్తావన తీసుకొచ్చింది ప్రియురాలు. ఎక్కడ నిజంగానే తనను పెళ్లి చేసుకోవల్సివస్తుంది అనుకున్నాడో ఎమోగానీ మొత్తానికి ఎలాగైన తనను వదిలించు కోవడానికి ప్రియుడు పక్కా పన్నాగం పన్నాడు. ఒక పథకంతో ఆమెను హత్య చేశాడు. మాడ్గుల పల్లి మండల కేంద్రంలోని కంకరమిల్లు సమీపంలో ఎముకలగూడు మాత్రమే ఉన్న మృతదేహం ఉందని పోలీసులకు ఫిర్యాదు అందింది దీంతో హుటా హుటినా పోలీసులు ఘటనస్థాలికి చేరుకుని గుర్తు తెలియని మహిళ హత్యగా కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇక ఈ కేసుకు సంబంధించి శుక్రవారం మిర్యాలగూడ రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో డీఎస్పీ శ్రీనివాస్‌ పూర్తి వివరాలను వెల్లడించారు.

డీఎస్పీ శ్రీనివాస్‌ తెలిపిన వివరాల ప్రకారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ (మం) కిష్టాపురం గ్రామానికి చెందిన రేవూరి నాగరాణి భర్త గత ఐదేండ్ల కింద రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. నాగరాణికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలను హాస్టల్‌లో చేర్పించి కొండ్రపోలు గ్రామంలో నార్కట్‌పల్లి అద్దంకి వద్ద ఉన్న ఓ దాబాలో దినసరి కూలిగా పనిచేస్తుంది. అయితే కొన్ని నెలల క్రితం తాండూరు కోటబాసుపల్లికి చెందిన గుర్రంపల్లి రాజుకు సెల్‌ నెంబర్‌కు పొరపాటున మిస్డ్‌కాల్‌ ఇచ్చింది రేవూరి నాగరాణి. దీంతో రాజు తన మొబైల్‌లో మిస్డ్‌కాల్‌ ఫోన్ చేద్దామని అనుకున్నాడు అయితే రాజు ఫోన్‌లో బ్యాలెన్స్ లేదు వెంటనే జహీరాబాద్‌కు చెందిన తన మిత్రుడు మంగలి తులసి ఫోన్‌తో తిరిగి నాగరాణికి ఫోన్‌ చేశాడు. ఫోన్ లిఫ్ట్ చేసి పొరపాటుగా తానే ఫోన్‌ చేశానని నాగరాణి చెప్పింది. దీంతో సరే అని రాజు ఫోన్ పెట్టేశాడు. ఇక ఆ రోజు నుండి తరచూ తులసికి ఫోన్ చేయడం మొదలుపెట్టింది నాగరాణి. మంగలి తులసి కూడా దొరికిందే అదునుగా తనతో క్లోజ్‌గా ఉండటం ప్రారంభించాడు.

ఆ పరిచయం కాస్త ప్రేమగా ముదిరింది. ఇక పనిలో పనిగా మంగలి తులసి తన ఆర్థిక అవసరాల కోసం నాగరాణి వద్ద బంగారు గొలుసు తాకట్టు పెట్టి రూ. 30వేల నగదు తీసుకెళ్లాడు. ఈ నగదు తిరిగి చెల్లించాలని, తనను పెళ్లి చేసుకోవాలని నాగరాణి తులసిపై తీవ్ర ఒత్తిడి తెచ్చింది. ఇక దీంతో నాగరాణిని ఎలాగైనా వదిలించుకోవాలనుకున్న మంగలి తులసి మార్చి 26న జహీరబాద్‌ నుంచి కిష్టాపురం గ్రామానికి వచ్చి రాత్రి ఆమెతో గడిపాడు. అనంతరం సరదాగా మనం అలా అలా తిరిగొద్దామంటూ మార్చి 27న నాగరాణిని జనసంచారం లేని కంకరమిల్లు వెనక్కు తీసుకెళ్లి కత్తితో గొంతుకోసి హత్య చేశాడు. నెలరోజులుగా ఆ మృతదేహన్ని ఎవరు చూడకపోవడంతో అక్కడే కుళ్లిపోయి ఎముకలు తేలాయి. నాగరాణి సెల్‌ఫోన్‌ నెంబరు డేటా ఆధారంగా నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకోవడంతో నేరాన్ని అంగీకరించాడు. తులసి నుండి సెల్‌ఫోన్‌, కత్తిని పోలీసులు జప్తు చేశారు.





Show Full Article
Print Article
Next Story
More Stories