విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు : మంత్రి ఎర్రబెల్లి

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు : మంత్రి ఎర్రబెల్లి
x
Highlights

పంచాయతీరాజ్ శాఖ అధికారులతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమావేశమయ్యారు. పంచాయితీ రాజ్, రూరల్ డెవలప్ మెంట్,ఆర్ డబ్యూఎస్ శాఖపై సీఎం కేసీఆర్ కి ఎంతో...

పంచాయతీరాజ్ శాఖ అధికారులతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమావేశమయ్యారు. పంచాయితీ రాజ్, రూరల్ డెవలప్ మెంట్,ఆర్ డబ్యూఎస్ శాఖపై సీఎం కేసీఆర్ కి ఎంతో నమ్మకం ఉందని మంత్రి దయాకర్ రావు అన్నారు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయ్యకుండా అందరం కలిసి పనిచేద్దామని ఆయన సూచించారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత క్షేత్రస్థాయిలో పర్యటిస్తానని చెప్పారు. నిధుల దుర్వినియోగం, విధుల్లో నిర్లక్ష్యం వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొత్త సర్పంచ్‌లను భాగస్వాములను చేసుకుని ముందుకు సాగాలని సూచించారు. ఈ నెల 22న మంత్రిగా బాధ్యతలు చేపడుతానని ఎర్రబెల్లి దయాకర్‌రావు స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories