మూడేళ్ల ప్రేమ.. కోరిక తీరింది.. మూడుముళ్లు అనేసరికి..

మూడేళ్ల ప్రేమ.. కోరిక తీరింది.. మూడుముళ్లు అనేసరికి..
x
Highlights

ప్రేమ ఇదోక ఎమోషన్..ఇందులో మునిగాక బయటకు రావడం చాలా కష్టమనే చెప్పవచ్చు. ప్రేమ ప్రయాణం విజయంతం అయితే పర్వలేదు అదే విఫలం అయితే..? ఈ లాంటి ఘటనే మనం...

ప్రేమ ఇదోక ఎమోషన్..ఇందులో మునిగాక బయటకు రావడం చాలా కష్టమనే చెప్పవచ్చు. ప్రేమ ప్రయాణం విజయంతం అయితే పర్వలేదు అదే విఫలం అయితే..? ఈ లాంటి ఘటనే మనం తెలుసుకోబోతున్నాం. ఓ ప్రేమ జంట సామాజిక మాధ్యమలా పరిచమై.. ఆ పరిచయం కస్తా ప్రేమగా చిగురించింది. అలా అలా వారి వారిద్దరూ " ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము యేలనో " అనే పాటలు పాడుకుంటూ చెట్టపట్టలేసుకుంటూ సాగారు. కాగా ఈ క్రమంలో ఆ యువతిని మాయమాటలు చెప్పి మొళ్లిగా లొంగదీసుకున్నారు. పెళ్లి చేసుకొవాలని పలుమార్లు ఆ యువకుడిని కోరింది. దీంతో ఆ యువకుడు ఉలుకు పలుకు లేకుండా జాడ పత్తలేకుండా పారిపోయాడు. ఈ ఘటన క్రిష్ణగిరి పట్టణ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకొంది. కర్ణాటక రాష్టం హోసూరు జిల్లా కేంద్రం క్రిష్ణగిరికి చెందిన 27 ఏళ్ల యువతి ఎమ్మెస్సీ పూర్తి చేసింది. మూడేళ్ల క్రితం కోయంబత్తూరు జిల్లా పొల్లాచ్చి సమీపంలోని విడుకంపాళ్యం గ్రామానికి చెందిన బాలన్‌తో ఫేస్ బుక్ లో పరిచయం అయింది.

ఇక అప్పటి నుండి వారిద్దరూ ప్రేమ పుట్టింది. పెళ్లి చేసుకుంటానంటూ నమ్మంచి పలుమార్లు ఆ యువతిని కోయంబత్తూరుకు పిలిపించుకొని లైంగిక ఆనందం పొందాడు. అయితే తీరా ఆ యువతి మనం పెళ్లి చేసుకోవాలని గట్టిగా అడిగింది. దీంతో ఎక్కడ ఆ అమ్మాయిని నిజంగానే పెళ్లిచేసుకోవాల్సి వస్తుందేమో అనుకున్నాడేమో కానీ అక్కడి నుండి జంప్ అయ్యాడు. ఫోన్‌ కూడా స్విచ్ఛాప్‌ చేసుకున్నాడు. ఇక దీంతో తాను మోసపోయినని అనుకున్న బాధితురాలు క్రిష్ణగిరి పోలీసులకు ఫిర్యాదు చేయగా పొల్లాచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. బాధితురాలు పొల్లాచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయగా మళ్లీ తిరిగి క్రిష్ణగిరికి వెళ్లాలని సమాధానం ఇచ్చారు. ఇక దీంతో లాభం లేదని మానసికంగా కుంగిపోయి, జీవితం మీద విరక్తి చెందిన ఆ యువతి ఈనెల 28వ తేదీ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొంది. విషయం తెలుకున్న పోలీసులు హుటాహుటినా ఘటనా స్థలికి చేరుకొని మృతదేహాన్ని శవపరీక్ష కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. యువతి ప్రియుడు బాలన్‌ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories