యువతితో స్నేహంగా ఉన్నందుకు.. గుండుకొట్టించి..

యువతితో స్నేహంగా ఉన్నందుకు.. గుండుకొట్టించి..
x
Highlights

తమ సోదరితో తరుచూ ఫోన్‌లో, బయటక కూడా వీరిద్దరూ క్లోజ్‌గా మాట్లాడుతున్నాడన్న కోపంతో ఆ యువకుడిని ఏకంగా కిడ్నప్ చేసి, గుండుకొట్టించిన వైనం. ఈ ఘటన...

తమ సోదరితో తరుచూ ఫోన్‌లో, బయటక కూడా వీరిద్దరూ క్లోజ్‌గా మాట్లాడుతున్నాడన్న కోపంతో ఆ యువకుడిని ఏకంగా కిడ్నప్ చేసి, గుండుకొట్టించిన వైనం. ఈ ఘటన బంజారాహిల్స్ పోలీసు ఠాణాలో చోటుచేసుకుంది. ఇక దీంతో బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక పోలీసుల వెల్లడించిన వివరాల ప్రకారం బంజారాహిల్స్ రోడ్ నం.12లోని ఫస్ట్‌లాన్సర్‌లో నివసిస్తున్న మహ్మద్ మన్సూర్ అలీఖాన్ అలియాస్ నసీర్(19) అదే ప్రాంతానికి చెందిన ఓ యువతితో స్నేహంగా ఉంటున్నాడు. అయితే వీరిద్దరూ ఫోన్లో మాట్లాడుకుంటున్నారన్న తెలుసుకున్న యువతి సోదరుడు ఇబ్రహీంఖాన్ తీవ్రకోపంతో రగిలిపోయాడు.

ఇక దీంతో సోమవారం మధ్యాహ్నం మన్సూర్‌ అలీఖాన్ కు ఫోన్ చేశాడు. నీతో అర్జెంట్ పని పడిదంటూ నువ్వు ఎక్కడ ఉన్నా కానీ వెంటనే జీవీకే మాల్‌వద్దకు రావాలని ఆదేశించాడు. దీంతో మన్సూర్‌ అలీఖాన్ జీవీకే మాల్ వద్దకు చేరుకున్నాడు. మన్సూర్‌ చూసిన ఇబ్రహీంఖాన్ వెంటనే తన కారు ఎక్కాల్సిందిగా భయభ్రాంతులకు గురిచేశాడు. అయితే కారులో ఎక్కేందుకు మన్సూర్‌ నిరాకరించడంతో అతి బలవంతంగా కారులోకి ఎక్కించుకోని సైదాబాద్ సమీపంలోని అక్బర్‌బాగ్‌కు తీసుకువెళ్లారు. అక్కడ ఓ మంగళి షాప్ కి తీసుకెళ్లి బలవంతంగా గుండుకొట్టించారు. తర్వాత మన్సూర్‌వద్ద ఉన్న సెల్‌ఫోన్‌ను, రూ.5వేలను లాక్కొని రాత్రి 7.45 గంటల ప్రాంతంలో అరాంఘర్ చౌరస్తావద్ద వదిలేశారు. మ చెల్లితో మాట్లాడితే ఏకంగా ప్రాణాలు తీస్తామని హెచ్చరించారు. దీంతో వెంటనే మన్సూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు నిందితుడు ఇబ్రహీంఖాన్‌తో పాటు అతడి స్నేహితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories