కోరిక తీర్చాలని భార్యపై పైశాచికం..ఆస్పత్రిలోనే.. చివరకు..

కోరిక తీర్చాలని భార్యపై పైశాచికం..ఆస్పత్రిలోనే.. చివరకు..
x
Highlights

చిత్తూరు ప్రభుత్వాసుపత్రిలో ఆదివారం అర్ధరాత్రి దారుణం జరిగింది. కట్టుకున్న భార్యపట్ల పశువులా ప్రవర్తించాడో వ్యక్తి. మద్యం మత్తులో ఉన్న కోరిక...

చిత్తూరు ప్రభుత్వాసుపత్రిలో ఆదివారం అర్ధరాత్రి దారుణం జరిగింది. కట్టుకున్న భార్యపట్ల పశువులా ప్రవర్తించాడో వ్యక్తి. మద్యం మత్తులో ఉన్న కోరిక తీర్చాలంటూ వెంటబడ్డాడు. ఓవైపు తన కూతురు జ్వరంతో ఆసుపత్రిలో చేరింది. కూతురికి సేవలు చేసుకుంటూ తల్లి కూడా ఆసుపత్రిలో ఉంది. చివరకు లైంగిక దాడికి పాల్పడి కూడా చివరకు ఆమెపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇక వివరాల్లోకి వెళితే చిత్తూరు జిల్లా యాదమరి మండలం పీసీ కండ్రిగ గ్రామానికి చెందిన నంద-పద్మలకు నంద, పద్మకు నలుగురు పిల్లలు ఉన్నారు. నంద కమ్మీల కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే గత కొద్దిరోజులుగా వీరి కుమార్తె జమున జ్వరం తీవ్రం కావడంతో చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే ఆదివారం పని నుంచి వచ్చిన నంద ఫుల్‌గా పీకల దాక తాగీ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చాడు.

తన కూతురి దగ్గర ఉన్న తన భార్యను బయటకి రావాలని పిలిచాడు. ఆసుపత్రిలో అందరూ చూస్తుండగానే భార్యను బలవంతపెట్టాడు. తన కోర్కె తీర్చాలని అడగ్గా ఆమె నిరాకరించి అక్కడినుంచి మళ్లీ కూతురు వద్దకు వచ్చింది. ఇక దీంతో నంద మళ్లీ ఆసుపత్రిలోకి వెళ్లి గగ్గోలు పెట్టాడు. తనకోరిక తీర్చాలని వార్డులో ఉన్న వారందరూ చూస్తుండగానే బలవంతపెట్టాడు. దీంతో తన ఒత్తుడి తట్టుకోలేక భర్తతో వెళ్లింది. తన కోర్కె తీరిన అనంతరం అతడు మళ్లీ ఆమెతో గొడవపడ్డాడు విచక్షణారహితంగా ఆమెపై దాడికి దిగాడు. దీంతో మోకాళ్లు, మెడ, తల, ముక్కు, చెప్పుకోలేని ప్రాంతాల్లో తీవ్రగాయాలై రక్తస్రావమైంది. దీంతో ఆమె స్పృహకోల్పోవడంతో పైఅంతస్తులో ఉన్న మెట్లపైనే పడిపోయింది. ఉదయం తన కూతురు తల్లిని వెత్కుంటూ పై అంతస్తుకి వెళ్లింది. తీరా చూసేసరికి తన తల్లి రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గమనించింది. వెంటనే అక్కడ ఉన్న వైద్యులకు చెప్పగా హుటాహుటిన ఐసీయూకి తరలించారు. ప్రస్తుతం అదే ఆసుపత్రిలో చికిత్సపొందుతోంది పద్మ. సంఘటనా స్థలానికి చేరుకుని విచారించి నిందితుడు నందను అదుపులోకి తీసుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories