6నెలలుగా తిరుగుతున్నా.. కోర్కె తీరుస్తావా.. లేదా?

6నెలలుగా తిరుగుతున్నా.. కోర్కె తీరుస్తావా.. లేదా?
x
Highlights

ఆడపిల్లలు ఎక్కడ ఒంటరిగా దొరికితే చాలు వారిని మానవ మృగాలు మాటలతోనో, చేతలతోనో హింసించడం మానడంలేదు ఈ లోకంలో.

ఆడపిల్లలు ఎక్కడ ఒంటరిగా దొరికితే చాలు వారిని మానవ మృగాలు మాటలతోనో, చేతలతోనో హింసించడం మానడంలేదు ఈ లోకంలో. అలాంటి ఘటనే తిపుపతి నగరంలో నివాసముంటున్న ఓ యువతి పుత్తూరులోని ఓ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా కాలం సాగిస్తుంది. ఆ యువతి తండ్రి చనిపోవడంతో తల్లితోనే కలిసి ఉంటుంది. అయితే ఆరునెలలుగా యువతిని నగరి మున్సిపాలిటీ మాజీ కమిషనర్ బాలాజీ యాదవ్ ఎలాగైనా నా కోరిక తీర్చాలంటూ ఆ యువతిని వరుసగా వేధింపులకు గురిచేస్తున్నాడు. అయితే శనివారం ఆ యువతి పాఠశాలకు వెళ్లేందుకు బస్టాప్‌లో నిలుచుంది. యువతిని ఫాలో అవుతూ అక్కడి చేరుకున్నాడు బాలాజీ యాదవ్. యువతిని అడ్డగించి నడిరోడ్డుపై యువతిని బేదిరిస్తూ ఆరు నెలలుగా నీ వెంట కుక్కలా తీరుగుతుంటే నాకోర్కే తీరుస్తావా లేదా? అని నడి రోడ్డుపై యువతితో వాగ్వాదానికి దిగాడు బాలజీ యాదవ్. యువతి ఏడుస్తూ ఎం మాట్లాడకపోవడంతో ఆమెపై దాడికి దిగాడు బాలాజీ యాదవ్. తోటి ప్రయాణికులు ప్రశ్నించడంతో బాలాజీ యాదవ్ తిరగబడ్డాడు. దింతో ప్రయాణికులు అతనికి దేహశుద్ది చేసి ఈస్టు పోలీసులకు అప్పగించారు. బాలాజీ యాదవ్ అక్కడి నగరి మున్సిపాల్ కమిషనర్ గా పనిచేసేవాడు. ఆర్ధిక అవకతవకలకు పాల్పడంతో బాలాజీ యాదవ్ సస్పెనన్‌ అయ్యాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories