కన్నకూతురిపై తండ్రి అత్యాచారం..

కన్నకూతురిపై తండ్రి అత్యాచారం..
x
Highlights

మానవత్వం మంటగలుస్తోంది. సొంత కూతురినే దారుణంగా అత్యాచారానికి ఒడిగట్టాడు కామాంధుడు. కూతురిపై అత్యాచారాన్ని అడ్డుకోబోయిన భార్యను దారుణంగా కొట్టి చంపాడు....

మానవత్వం మంటగలుస్తోంది. సొంత కూతురినే దారుణంగా అత్యాచారానికి ఒడిగట్టాడు కామాంధుడు. కూతురిపై అత్యాచారాన్ని అడ్డుకోబోయిన భార్యను దారుణంగా కొట్టి చంపాడు. ఈ ఘటన ఒడిశాలోని జాజ్‌పూర్ జిల్లా కుమారి గ్రామంలో చోటుచేసుకుంది. ఇక వివరాల్లోకి వెళితే కుమారి గ్రామానికి చెందిన బిజయ బెహరాకు భార్య, కూతురు(మైనర్) ఉన్నారు. కూతురిపై కన్నేసిన తండ్రి ఆమెను ఎలాగైన తనివితీరా అనుభవించాలని ఫిక్స్ అయ్యాడు. గత నెల 2వ తేదీన అర్ధరాత్రి వేరే వ్యక్తి సహాయంతో దగ్గరలోని ఓ కొండ ప్రాంతానికి కూతుర్ని బలవంతగా ఎత్తుకెళ్లిపోయాడు. అది చూసిన తన భార్య అడ్డుకొవడానికి యత్నించింది. కొండ మీదకి వెళ్లాక బెహరాతో వచ్చిన వ్యక్తి వెళ్లిపోయాడు. వెంటనే, ఆ నీచుడు కూతురిపై అత్యాచారం చేయబోయాడు. అది చూసిన భార్య అతడ్ని అడ్డుకుంది. కన్న కూతురిపైనే అత్యాచారం చేయడం ఏంటని ప్రశ్నించింది. దీంతో తీవ్రకోపగ్రస్తుడై భార్యను విచక్షణారహితంగా చితకబాదాడు. దీంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలువిడిచింది. ఓ వైపు భార్యశవం పక్కనే ఉన్న కానీ కూతుర్ని రేప్ చేశాడు. తన కూతురు సరిగా సహకరించడం లేదని దారుణంగా కొట్టి అక్కడి నుండి పారిపోయాడు.

బాధితుల అరుపులు విన్న కొందరు స్థానిక యువకులు హుటాహుటినా కొండపైకి వెళ్లి చూసేసరికి మహిళ చనిపోయి ఉంది. ఆ బాలిక ప్రాణాపాయస్థితిలో ఉండటంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు బాలికను ఆస్పత్రిలో చేర్పించి, ఆమె తల్లి మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపించారు. బాలిక ఇచ్చిన సమాచారంతో తన తండ్రే నిందితుడని నిర్ధారించుకొని, కేసు నమోదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేపట్టగా నిందితుడు కేరళకు పారిపోయినట్లు తెలిసింది. సోమవారం అక్కడికి వెళ్లిన పోలీసులు నిందితుడ్ని అరెస్టు రిమాండ్‌కు తరలించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories