నిజామాబాద్‌లో ఇవాళ మొదటిదశ మాక్‌ పోలింగ్‌

నిజామాబాద్‌లో ఇవాళ మొదటిదశ మాక్‌ పోలింగ్‌
x
Highlights

185 మంది అభ్యర్థులతో రికార్డ్ సృష్టించిన నిజామాబాద్‌ లోక్‌సభ స్థానంలో ఎన్నికల నిర్వహణపై యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు జరుగుతున్నాయి. సమయం దగ్గర...

185 మంది అభ్యర్థులతో రికార్డ్ సృష్టించిన నిజామాబాద్‌ లోక్‌సభ స్థానంలో ఎన్నికల నిర్వహణపై యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు జరుగుతున్నాయి. సమయం దగ్గర పడుతుండటంతో ఇవాళ ఎన్నికల అధికారులు మాక్‌ పోలింగ్‌ను నిర్వహిస్తున్నారు. దేశంలోనే తొలిసారిగా ఈ ఎన్నిక కోసం 12 బ్యాలెట్‌ యూనిట్లను వినియోగిస్తున్నారు. ఒక్కో టేబుల్‌పై ఈవీఎంలతో పాటు ఓ కంట్రోల్‌ యూనిట్‌ వీవీప్యాట్‌ను ఉంచుతారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులకు శిక్షణ ఇచ్చేందుకు నిర్వహించనున్న ఈ మాక్‌ పోలింగ్‌ కోసం రాష్ట్ర ఎన్నికల అధికారి రజత్‌కుమార్‌ నిజామాబాద్‌కు వస్తున్నారు. ఆయన పర్యవేక్షణలో మాక్‌ పోలింగ్‌ జరగనుంది.


Show Full Article
Print Article
Next Story
More Stories