రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్న కేసీఆర్‌

రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్న కేసీఆర్‌
x
Highlights

సీఎం కేసీఆర్‌‌ తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఈ క్రమంలో తిరుమల చేరుకున్న శ్రీవారికి కేసీఆర్‌ స్వాగతం పలికారు టీటీడీ ఈశో సింఘాల్‌. తిరుమల పర్యటన...

సీఎం కేసీఆర్‌‌ తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఈ క్రమంలో తిరుమల చేరుకున్న శ్రీవారికి కేసీఆర్‌ స్వాగతం పలికారు టీటీడీ ఈశో సింఘాల్‌. తిరుమల పర్యటన సంరద్భంగా ఈరోజు రాత్రి పద్మావతి అతిధఇ గృహంలో బస చేస్తున్నారు కేసీఆర్‌.తెలంగాణ సీఎం కేసీఆర్‌ తిరుమల శ్రీవారి దర్శించుకోనున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట ఎయిర్‌ పోర్ట్‌కు వెళ్లారు. అక్కడి నుంచి కారులో తిరుమలకు చేరుకున్నారు. సీఎం కేసీఆర్‌ కుటుంబసమేతంగా సోమవారం ఉదయం వెంకన్నను దర్శించుకోనున్నారు. ఇందుకు అధికారులు అన్నీ ఏర్పాట్లు చేశారు. కేసీఆర్‌ తిరుమల పర్యటన సందర్భంగా స్వాగత బ్యానర్లు ఏర్పాటు చేశారు. జగన్‌ భారీ మెజార్టీతో గెలిచిన తరుణంలో కేసీఆర్‌ తిరుమల పర్యటన ప్రత్యేకతను సంతరించుకుంది. కాగా రెండోసారి తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత కేసీఆర్‌ తొలిసారిగా తిరుమల వస్తుండడంతో ఆయన అభిమానులు భారీ ఎత్తున స్వాగత ఏర్పాట్లు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories