ఫాస్టర్ పైత్యం...ప్రార్ధన పేరుతో...

ఫాస్టర్ పైత్యం...ప్రార్ధన పేరుతో...
x
Highlights

దెయ్యం పడితే వదిలిస్తా.. రోగం వస్తే మాయం చేస్తా.. ఆర్థిక ఇబ్బందులున్నా, ఇతర ఏ బాధలున్నా నేనున్నా అంటూ ఓ మాయగాడు ప్రజలను మోసం చేస్తూ దందా షురూ చేశాడు...

దెయ్యం పడితే వదిలిస్తా.. రోగం వస్తే మాయం చేస్తా.. ఆర్థిక ఇబ్బందులున్నా, ఇతర ఏ బాధలున్నా నేనున్నా అంటూ ఓ మాయగాడు ప్రజలను మోసం చేస్తూ దందా షురూ చేశాడు ప్రేయర్ పేరుతో మత్తు చల్లి జనాలను చితక్కొట్టాడు మహిళలను లైంగిక వేధింపులకు గురిచేస్తూ చివరకు కటకటాల పాలయ్యాడు.

సికింద్రాబాద్ కు చెందిన శాంసన్ ఓ మత బోధకుడు జనాలను బురిడీ కొట్టించడంలో ఈ పాస్టర్ ఆరితేరాడు దయ్యం వదిలిస్తా, రోగం మాయం చేస్తా, ఆర్థిక ఇబ్బందులు లేకుండా చేస్తా అంటూ మాయ మాటలు చెప్పి అమాయక ప్రజలను లొంగతీసుకోవడం ప్రారంభించాడు సమస్యలు తీరుతాయని చెప్పి ప్రార్థనల పేరుతో జనాలపై మత్తు స్ప్రే చల్లుతూ వారి ముఖంపై చెంపలపై, వీపుపై కొడుతుండటమే కాకుండా మహిళలను లైంగికంగా వేదిస్తుండేవాడు..

అయినా తమ ఇబ్బందులు, సమస్యలు తీరకపోవడంతో అనుమానం వచ్చిన పలువురు పోలీసులను ఆశ్రయించారు. మరికొందరు తమను లైంగిక వేధింపులకు గురిచేశారంటూ తమ గోడును వెళ్లబోసుకున్నారు. శాంసన్ పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడిని అరెస్ట్ చేసి సికింద్రాబాద్ కోర్టులో హాజరుపరిచారు. దీనిపై విచారణ చేపట్టిన జడ్జి నిందితుడు శాంసన్ కు 14రోజులు రిమాండ్ విధించారు. కోర్టుకు హాజరైన శాంసన్ తనపై ఫిర్యాదు చేసిన మహిళల ఫోటోలు తీయడంతో పోలీసులు మరో కేసు నమోదు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories