సీఈసీ కార్యాలయానికి చేరుకున్న చంద్రబాబు

సీఈసీ కార్యాలయానికి చేరుకున్న చంద్రబాబు
x
Highlights

ఏపీ సీఎం చంద్రబాబు కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయానికి చేరుకున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి సునీల్ అరోరాతో పాటు ఇతర కమిషనర్లతో చంద్రబాబు...

ఏపీ సీఎం చంద్రబాబు కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయానికి చేరుకున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి సునీల్ అరోరాతో పాటు ఇతర కమిషనర్లతో చంద్రబాబు బృందం సమావేశమైంది. ఈవీఎంలు మొరాయించడం, సైకిల్ కు ఓటేస్తే ఇతర గుర్తులకు ఓటు పడటం వంటి ఘటనలను ఈ సందర్భంగా ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. ఎన్నికల నిర్వహణ వైఫల్యాలపై కేంద్ర ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించినట్టు సమాచారం.

23 మంది సభ్యుల బృందంతో ప్రత్యేక విమానంలో చంద్రబాబు ఢిల్లీ చేరుకున్నారు. చంద్రబాబు వెంట టీడీపీ ఎంపీలు, మంత్రులు, పార్టీ ముఖ్య నేతలు ఉన్నారు. 23 మంది సభ్యుల బృందంతో కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయానికి చేరుకున్న చంద్రబాబు ఎన్నికల కమిషనర్లను కలవడంతో పాటు ఏపీలో ఎన్నికలు జరిగిన తీరుపై ఢిల్లీ వేదికగా ఉద్యమానికి సిద్ధమయ్యారు.

Show Full Article
Print Article
Next Story
More Stories