వైసీపీలో చేరిన పార్థసారధి రెడ్డి

వైసీపీలో చేరిన పార్థసారధి రెడ్డి
x
Highlights

ఏపీలో పోలింగ్‌ ముహూర్తం చేరువయ్యేకొద్దీ వైసీపీలోకి చేరికల వెల్లువ కొనసాగుతోంది. ఇటివలే పలువురు టీడీపీ, ఇతర పార్టీలనుండి భారీగా వైసీపీ గూటికి చేరారు....

ఏపీలో పోలింగ్‌ ముహూర్తం చేరువయ్యేకొద్దీ వైసీపీలోకి చేరికల వెల్లువ కొనసాగుతోంది. ఇటివలే పలువురు టీడీపీ, ఇతర పార్టీలనుండి భారీగా వైసీపీ గూటికి చేరారు. ఈ నేపథ్యంలో పలువురు సినీ నటులు కూడా వైసీపీలో చేరిన విషయం తెలిసిందే తాజాగా కర్నూలు జిల్లా పాణ్యం మాజీ ఎమ్మెల్యే బిజ్జం పార్థసారథిరెడ్డి గురువారం వైసీపీలో చేరారు. నంద్యాలలో ఎన్నికల ప్రచారంలో భాగంగా జగన్ సభలో పార్థసారధి రెడ్డికి వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. శ్రీశైలం నియోజకవర్గానికి చెందిన వెలుగోడు మండల జెడ్పీటీసీ లాల్‌స్వామి, డాక్టర్‌ రవికృష్ణ తదితరులు కూడా వైసీపీలో చేరారు.

Show Full Article
Print Article
Next Story
More Stories