వీడిన హాజీపూర్ వరుస హత్యల మిస్టరీ..వెలుగులోకి నివ్వెరపోయే విషయాలు..

వీడిన హాజీపూర్ వరుస హత్యల మిస్టరీ..వెలుగులోకి నివ్వెరపోయే విషయాలు..
x
Highlights

యాదాద్రి భువనగిరి జిల్లా హాజీపూర్‌లో హత్యలు దండుపాళ్యం సినిమాను తలపిస్తున్నాయి. టెన్త్‌ విద్యార్ధిని శ్రావణిని అత్యంత కిరాతంగా గ్యాంగ్‌ రేప్ చేసి చంపి...

యాదాద్రి భువనగిరి జిల్లా హాజీపూర్‌లో హత్యలు దండుపాళ్యం సినిమాను తలపిస్తున్నాయి. టెన్త్‌ విద్యార్ధిని శ్రావణిని అత్యంత కిరాతంగా గ్యాంగ్‌ రేప్ చేసి చంపి పడేసిన బావిలోనే మరో అమ్మాయి డెడ్‌బాడీ దొరకడం కలకలం రేపుతోంది. అచ్చం దండుపాళ్యం సినిమా మాదిరిగా జరిగిన రేప్ అండ్ మర్డర్స్‌ సంచలనంగా మారాయి. యాదాద్రి భువనగిరి జిల్లా హాజీపూర్‌లో మృతదేహాల కలకలం కొనసాగుతోంది. టెన్త్ విద్యార్ధిని శ్రావణి డెడ్‌బాడీని వెలికితీసిన బావిలోనే మరో అమ్మాయి మృతదేహం దొరకడం తీవ్ర కలకలం రేపుతోంది. బావి నుంచి బయటికి తీసిన మృతదేహాన్ని హాజీపూర్‌కి చెందిన మనీషాగా గుర్తించారు. రెండు నెలల క్రితం అదృశ్యమైన మనీషా హాజీపూర్ బావిలో ఎముకుల గూడై తేలడం సంచలనంగా మారింది.

శ్రావణిని గ్యాంగ్ రేప్ చేసి, చంపినట్లే మనీషాను కూడా సామూహిక అత్యాచారం తర్వాత చంపి మృతదేహాన్ని బావిలో పడేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. శ్రావణి కేసులో నిందితులే మనీషాను కూడా చంపి ఉంటారని భావిస్తున్నారు. ఇదే కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. హాజీపూర్ బావిలో మరో అమ్మాయి మృతదేహం దొరకడంతో గ్రామంలో మరోసారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దాంతో గ్రామంలో పెద్దఎత్తున బలగాలను మోహరించారు. మరోవైపు బావి నుంచి వెలికి తీసిన మనీషా మృతదేహాన్ని హైదరాబాద్‌ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌‌కి తరలించారు.

ఎట్టకేలకు హాజీపూర్‌లో శ్రావణి, మనీషాల వరుస హత్యల మిస్టరీ వీడింది. శ్రీనివాస రెడ్డి అనే ఓ ఏసీ మెకానిక్ ఈ హత్యలకు పాల్పడినట్టు పోలీసులు నిర్దారించారు. అయితే స్కూళ్లు, కాలేజీల నుంచి తిరిగొచ్చే యువతులే టార్గెట్‌గా శ్రీనివాస్ రెడ్డి పక్క ప్యూహాంతో ఉండేవాడు. హాజీపూర్ గ్రామానికి బస్సులు తక్కువగా ఉండటంతో లిఫ్ట్ అడిగి వెళ్లడం ఆ గ్రామస్థులకు అలవాటేనని, అయితే దీన్నే ఆసరాగా చేసుకొని శ్రీనివాస్ రెడ్డి యువతులకు లిఫ్ట్ ఇచ్చేవాడని తెలిపారు. ఆ తర్వాత అదును చూసి వేర్వేరు సందర్భాల్లో ఇద్దరిపై అత్యాచారం, హత్య చేసినట్టు సమాచారం. మరోవైపు గ్రామస్తులు దాడి చేస్తారన్న భయంతో అతడి కుటుంబ సభ్యులు హాజీపూర్‌ వదిలి పారిపోయారు. శ్రీనివాసరెడ్డి కారణంగా తమ గ్రామానికి చెడ్డ పేరు వచ్చిందని హాజీపూర్‌ వాసులు వాపోయారు. మొదటి నుంచి అతడికి నేర చరిత్ర ఉందని వెల్లడించారు.శివరాత్రి రోజు మనీషాను లిఫ్ట్ పేరుతో బైక్‌పై ఎక్కించుకొని అత్యాచారం చేసి హతమార్చాడని, మృతదేహాలను నిందితుడు తన బావిలోనే పాతిపెట్టాడని అన్నారు.ప్రధాన నిందితుడిగా భావిస్తున్న శ్రీనివాస్‌రెడ్డిని ఇంటిని మంగళవారం ఉదయం గ్రామస్థులు ముట్టడించారు. ఆగ్రహంతో రగిలిపోతున్న గ్రామస్థులు శ్రీనివాస్ ఇంటిని తగలబెట్టారు. అయితే చుట్టుపక్కల గ్రామాల్లోనూ గత కొన్నేళ్లలో చాలామంది యువతులు అదృశ్యమయ్యారని ఆ ఘటనల వెనుక కూడా శ్రీనివాసరెడ్డే ఉన్నాడా? అన్న కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories