ఉచిత గ్యాస్ కనెక్షన్ ఇప్పిస్తామని నమ్మించి.. చివరికి..

ఉచిత గ్యాస్ కనెక్షన్ ఇప్పిస్తామని నమ్మించి.. చివరికి..
x
Highlights

రాజస్థాన్‌లో దారుణం చోటుచేసుకుంది. ఉచిత గ్యాస్ కనెక్షన్ ఇప్పిస్తామని నమ్మించి 25 ఏండ్ల యువతిపై గ్యాంగ్ రేప్ చేశారు. ఈ సంఘటన జైపూర్ సిటీకి సమీపంలో...

రాజస్థాన్‌లో దారుణం చోటుచేసుకుంది. ఉచిత గ్యాస్ కనెక్షన్ ఇప్పిస్తామని నమ్మించి 25 ఏండ్ల యువతిపై గ్యాంగ్ రేప్ చేశారు. ఈ సంఘటన జైపూర్ సిటీకి సమీపంలో వెలుగుచూసింది. ఇక వివరాల్లోకి వెళితే నాగౌర్ జిల్లాకు చెందిన 25 ఏళ్ల యువతి తాను గ్యాస్ కనెక్షన్ కోసం ప్రయత్నిస్తోంది. ఇందుకోసం గత మార్చినెలలో గ్యాస్ కనెక్షన్ కోరుతూ దరఖాస్తు ఇచ్చేందుకు ఓ కియోస్క్‌కు వెళ్లింది. అయితే అక్కడే పనిచేసే ముఖేశ్ అనే వ్యక్తి ఆ యువతిపై కన్నేసాడు. సరిగ్గా మే 7న ఆమె ఇంటికి వెళ్లాడు ఆ యువకుడు. తనతో వస్తే నీకు ఫ్రీగా గ్యాస్ కనెక్షన్ ఇప్పిస్తానని ఎలాంటి డబ్బులు కూడా ఖర్చుకాకుండా చూసుకుంటానని ఆ యువతిని నమ్మించాడు. అయితే ఇందులో భాగంగానే గ్యాస్ కనెక్షన్ కోసం కుచమాన్ సిటీలో దరఖాస్తు చేసుకోవల్సి వస్తుందని చెప్పాడు.

దీనికి ఆ యువతి అతడి మాటలు నమ్మించి అక్కడికి తీసుకెళ్లాడు. అక్కడ కూర్చున్న యువతికి కూల్ డ్రింక్ తాగమని చెప్పారు. సరే అని ఆ కూల్ డ్రింక్ తాగింది. అయితే ఆ కూల్ డ్రింక్‌లో మత్తమందు కలిపిన విషయం ఆ యువతికి తెలియదు. దీంతో సృహకోల్పోయిన ఆ యువతిని ముఖేశ్, తన స్నేహితులతో కలిసి గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డాడు. అత్యాచారం చేస్తున్న సమయంలో మొబైల్‌లో వీడియో తీశారు, ఆ యువతకి స్పృహ వచ్చిన తర్వాత ఆయువతికి చూపించి బ్లాక్‌మెయిల్ చేశారు. తాము చెప్పినట్టు వినాలంటూ బెదిరించారు. మేము ఎప్పుడు రమ్మంటే అప్పుడు రావలని కోరారు. దీనికి సరే అని చెప్పిన ఆ మహిళ అక్కడి నుండి తప్పించుకొని నేరుగా పోలీస్ ఠాణాకు వెళ్లి ఫిర్యాదు చేసింది. ఆ యువతి ఫిర్యాదు మేరకు ముఖేశ్, అతని ఇద్దరు స్నేహితుల కోసం గాలిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories