యాదాద్రి భువనగిరి జిల్లాలో మరో దుర్ఘటన..

యాదాద్రి భువనగిరి జిల్లాలో మరో దుర్ఘటన..
x
Highlights

యాదాద్రి జిల్లా బొమ్మలరామారం మండలం మైసిరెడ్డిపల్లి శివారులో ప్రమాదం జరిగింది. వేగంగా వెళుతున్న ఓ కారు బోల్తా పడడంతో అక్కడికక్కడే ముగ్గురు మృతి...

యాదాద్రి జిల్లా బొమ్మలరామారం మండలం మైసిరెడ్డిపల్లి శివారులో ప్రమాదం జరిగింది. వేగంగా వెళుతున్న ఓ కారు బోల్తా పడడంతో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందారు. గాయపడిన మరో ఇద్దర్ని హైదరాబాద్‌ తరలించారు. అయితే, చికిత్స పొందుతూ వినీత్ రెడ్డి చనిపోయాడు. మృతుల్లో ఇద్దరు యువతులు, మరో ఇద్దరు యువకులు ఉన్నారు. ఇబ్రహీంపట్నం శ్రీహిందూ కాలేజీలో బీటెక్‌ ఫైనలియర్ చదువుతున్న వీరంతా ఎగ్జామ్స్‌ అయిపోవడంతో బొమ్మలరామారంలోని ఓ ఫామ్‌ హౌస్‌లో పార్టీ చేసుకున్నారు. మద్యం మత్తులో అతి వేగంగా కారు డ్రైవ్ చేయడంతో బోల్తా పడినట్టు తెలుస్తోంది. మృతులు హైదరాబాద్ కొత్తపేట్‌కు చెందిన స్ఫూర్తి, చాదర్‌ఘాట్‌కు చెందిన ప్రణీత, చంపాపేట్‌ ప్రగతినగర్‌కు చెందిన చైతన్య, హైదరాబాద్‌కు చెందిన వినీత్‌గా గుర్తించారు.


Show Full Article
Print Article
Next Story
More Stories