The Exploration Company: అంతరిక్షంలో అస్థికలు ఉంచే ప్రయత్నం విఫలం... సముద్రంలో కూలిపోయిన స్పేస్ క్యాప్సూల్


The Exploration Company: అంతరిక్షంలో అస్థికలు ఉంచే ప్రయత్నం విఫలం... సముద్రంలో కూలిపోయిన స్పేస్ క్యాప్సూల్
భూమిపై కాకుండా, అంతరిక్షంలో తమకు చివరి వీడ్కోలు లభించాలన్న ఆశతో కుటుంబ సభ్యులు ఎన్నో ఆశలతో ఎదురు చూశారు. కానీ ఆ కలలు అర్ధాంతరంగా చెదిరిపోయాయి. జర్మనీకి చెందిన ‘ది ఎక్స్ప్లోరేషన్ కంపెనీ’ (TEC) చేపట్టిన స్పేస్ బరియల్ మిషన్ ‘మిషన్ పాజిబుల్’ తుది ఘట్టంలో విఫలమైంది.
భూమిపై కాకుండా, అంతరిక్షంలో తమకు చివరి వీడ్కోలు లభించాలన్న ఆశతో కుటుంబ సభ్యులు ఎన్నో ఆశలతో ఎదురు చూశారు. కానీ ఆ కలలు అర్ధాంతరంగా చెదిరిపోయాయి. జర్మనీకి చెందిన ‘ది ఎక్స్ప్లోరేషన్ కంపెనీ’ (TEC) చేపట్టిన స్పేస్ బరియల్ మిషన్ ‘మిషన్ పాజిబుల్’ తుది ఘట్టంలో విఫలమైంది. ‘నిక్స్’ అనే స్పేస్ క్యాప్సూల్, భూమి కక్ష్యను విజయవంతంగా చేరిన తరువాత, భూమికి తిరిగి వస్తున్న సమయంలో పసిఫిక్ మహాసముద్రంలో కుప్పకూలింది.
ఈ ప్రత్యేకమైన ప్రయోగంలో 166 మంది మృతుల అస్థికలతో పాటు, ఔషధ ప్రయోగాల కోసం కొన్ని గంజాయి విత్తనాలు, ఇతర ప్రయోగ పరికరాలను క్యాప్సూల్లో ఉంచారు. జూన్ 23న ఇది నింగిలోకి ప్రయాణం ప్రారంభించి, భూమి చుట్టూ రెండు కక్ష్యల చుట్టీ తిరిగింది. తిరిగి భూమికి చేరుతున్న సమయంలో కొన్ని కీలక దశల్లో కూడా కమ్యూనికేషన్ పునరుద్ధరణ అయింది. అయితే భూమిపై సురక్షితంగా దిగడానికి కొద్దిక్షణాల ముందు క్యాప్సూల్తో ఉన్న సంబంధం పూర్తిగా తెగిపోయింది. తర్వాత పసిఫిక్ సముద్రంలో కూలినట్లు అధికారికంగా ధృవీకరించబడింది.
దీన్ని ‘పాక్షిక విజయం’గా పేర్కొంటూ సంస్థ స్పందించింది. వారి ప్రకటనలో, ప్రయోగం ప్రారంభం నుండి చాలా కీలక దశలు విజయవంతం అయ్యాయని, చివరి దశలోనే తలెత్తిన సాంకేతిక లోపమే సమస్యగా మారిందని వివరించారు. భవిష్యత్తులో మరింత శాస్త్రీయ పద్ధతుల ఆధారంగా మిషన్ నిర్వహణ కోసం దర్యాప్తు కొనసాగుతుందని కంపెనీ లింక్డ్ఇన్ ద్వారా తెలిపింది.
ఇదే మిషన్కు భాగస్వామిగా ఉన్న అమెరికాకు చెందిన సెలెస్టిస్ సంస్థ ఈ ఘటనపై తీవ్ర దిగులును వ్యక్తం చేసింది. క్యాప్సూల్ లోని అస్థికలను వెలికితీయడం అసాధ్యమని తేల్చేసింది. పసిఫిక్ సముద్రం లోతుల్లో శాశ్వతంగా ఆ మృతుల అస్థికలు విశ్రాంతి తీసుకుంటున్నాయన్న విషయాన్ని బాధతో పేర్కొంది. ఈ అనుభవం ఎంతవరకు సాంకేతికంగా ప్రయోగాత్మక విజయం కావచ్చునా, కుటుంబ సభ్యులకు కలిగిన నష్టాన్ని మాత్రం భర్తీ చేయలేదని సెలెస్టిస్ సీఈఓ చార్లెస్ ఎం. చాఫర్ అన్నారు.
ఇంత ప్రత్యేకమైన ప్రయోగాన్ని ఆశయబద్ధంగా ప్రారంభించిన సంస్థలు చివరికి మౌనంగా విచారం వ్యక్తం చేయాల్సి వచ్చింది. అంతరిక్షంలో శాశ్వతంగా స్థానం దొరకాలని ఆకాంక్షించిన వారికిది తీవ్ర వెదనగా నిలిచింది. భూమిపై కాకుండా, నక్షత్రాల మధ్య తమకు స్థానం లభించాలని కలలు కన్నారు. కానీ చివరికి, ఆ ఆశలు సముద్ర గర్భంలో ముగిసిపోయిన ఈ సంఘటన, మానవతా భావనలతో కూడిన టెక్నాలజీ ప్రయోగాల ముందు ఏవిధంగా అవినీతి, అపశృతి పనిచేయగలవో చాటిచెప్పింది.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



