రెండు కొరియా దేశాల మధ్య కాల్పులు

రెండు కొరియా దేశాల మధ్య కాల్పులు
x
Highlights

మొన్నటివరకూ ఎంతో స్నేహపూర్వకంగా మెలిగిన రెండు దేశాలు ఇప్పుడు కాల్పులు చేసుకుంటున్నాయి.

మొన్నటివరకూ ఎంతో స్నేహపూర్వకంగా మెలిగిన రెండు దేశాలు ఇప్పుడు కాల్పులు చేసుకుంటున్నాయి.దక్షిణ కొరియా - ఉత్తర కొరియా దళాలు ఆదివారం తమ సరిహద్దులో కాల్పులు జరిపినట్లు దక్షిణాది సైన్యం తెలిపింది, ప్రత్యర్థులు ఫ్రంట్-లైన్ లో బలగాలను తగ్గించడానికి ఈ చర్యలకు పూనుకున్నట్లు తెలిపింది. హింసాత్మక ఘర్షణలు అప్పుడప్పుడు సరిహద్దు వెంబడి జరుగుతుంటాయి, అయితే ఆదివారం అవి మరి శృతిమించాయి.. దాంతో ఇరువైపులా కాల్పులకు దారితీసింది. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.

ముందుగా సరిహద్దు రేఖ వద్ద ఉన్న దక్షిణ కొరియా గార్డుపై ఉత్తర కొరియా దళాలు కాల్పులు జరిపారని.. సియోల్‌లోని జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ ఒక ప్రకటనలో తెలిపింది . దీంతో శత్రువులను తిప్పికొట్టేందుకు దక్షిణ కొరియా మొత్తం 20 రౌండ్ల కాల్పులు జరిపినట్టు తెలిపారు. దక్షిణ కొరియాకు ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని మిలటరీ తెలిపింది. అయితే ఉత్తర కొరియా మాత్రం ఎటువంటి సమాచారాన్ని అందించలేదు.



Show Full Article
Print Article
Next Story
More Stories