Sonia Gandhi: సోనియా, రాహుల్‌ ఈడీ కేసుపై కీలక అప్‌డేట్.. ఢిల్లీ కోర్టు ఏం చెప్పిందంటే?

Sonia Gandhi: సోనియా, రాహుల్‌ ఈడీ కేసుపై కీలక అప్‌డేట్.. ఢిల్లీ కోర్టు ఏం చెప్పిందంటే?
x
Highlights

ఈ కేసులో తదుపరి విచారణ మే 8న జరగనుంది. విచారణకు ముందు కోర్టు ఇచ్చిన ఈ నోటీసులు న్యాయ ప్రక్రియలో సమానత్వాన్ని కాపాడే దిశగా కీలక అడుగుగా భావిస్తున్నారు.

Sonia Gandhi: ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు, నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సహా ఇతరులపై అభియోగాలు నమోదు చేసే అంశంపై విచారణ జరిపే ముందు, వారికి నోటీసులు జారీ చేసింది. కోర్టు చెప్పిన ప్రకారం, అభియోగాలను నమోదు చేసే దశలో ప్రతివాదులకు వాదనలు వినిపించే హక్కు ఉంది. ఈ హక్కు భారతీయ నాగరిక సురక్షా సంహిత (BNSS) సెక్షన్ 223లోని ప్రత్యేక నిబంధనల ప్రకారం ఉంది.

ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దాఖలు చేసిన చార్జిషీట్‌లో గుర్తించబడిన లోపాలను సరిచేసినట్లు కోర్టు పేర్కొంది. దీంతో, ఈ దశలో కేసును తీసుకోవాలా వద్దా అన్నదానిపై నిర్ణయం తీసుకునే ముందు ప్రతివాదులను వినడం అవసరం అని అభిప్రాయపడింది. కోర్టు మరోసారి న్యాయ విచారణలో పారదర్శకతను బలపరిచింది.

ఇక ఈ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ నేతలు సమ్ పిట్రోడా, సుమన్ దూబేలను కూడా అభియోగపత్రంలో ED పేర్కొంది. వారి పాలనలో ఉన్న యంగ్ ఇండియన్ అనే ప్రైవేట్ సంస్థ ద్వారా, నేషనల్ హెరాల్డ్‌ను ప్రచురించే అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (AJL) రూ. 2,000 కోట్ల విలువైన ఆస్తులను కేవలం రూ. 50 లక్షలతో స్వాధీనం చేసుకున్నారని ED ఆరోపించింది. ఈ కేసులో తదుపరి విచారణ మే 8న జరగనుంది. విచారణకు ముందు కోర్టు ఇచ్చిన ఈ నోటీసులు న్యాయ ప్రక్రియలో సమానత్వాన్ని కాపాడే దిశగా కీలక అడుగుగా భావిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories