-1981లో వచ్చిన ద ఐస్ ఆఫ్ డార్క్ నెస్ నవల -నవలలో వుహాన్-400 వైరస్ గురించి వివరణ
ప్రపంచవ్యాప్తంగా భయకంపితుల్ని చేస్తున్న కోవిడ్-19 ను పోలిన ప్రమాదకర వైరస్ గురించి 40 ఏళ్ల కిందటే ఓ నవలలో ప్రస్తావించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆ నవల పేరు ద ఐస్ ఆఫ్ డార్క్ నెస్. కాల్పనిక ఇతివృత్తంతో రాసిన ఈ థ్రిల్లర్ నవల 1981లో వచ్చింది. అమెరికాకు చెందిన డీన్ కూంట్జ్ దీని రచయిత. ఆ నవలలో... వుహాన్-400 అనే వైరస్ను చైనా శాస్త్రవేత్తలు జీవాయుధంగా రూపొందిస్తారు. శత్రుదేశాలపై యుద్ధాల్లో ఉపయోగించేందుకు ఈ జీవాయుధాన్ని చైనా సిద్ధం చేస్తుంది. ఓ మిలిటరీ ప్రయోగశాలలో ఈ వుహాన్-400 వైరస్ను సృష్టిస్తారు. ఇది మనుషులపై విపరీతమైన ప్రభావం చూపుతుందని, దీన్ని ప్రయోగించడం ద్వారా కొన్ని దేశాలను తుడిచిపెట్టవచ్చని ఆ నవలలో పేర్కొన్నారు. తాజాగా ఓ నెటిజన్ ఈ నవలలోని అంశాలను వెలుగులోకి తీసుకువచ్చాడు. ఇప్పుడు కరోనా వైరస్ మొదలైన ప్రాంతం కూడా వుహాన్ కావడంతో ఈ అంశానికి విపరీతమైన ప్రాధాన్యం ఏర్పడింది.
Well this is interesting.
— l E T 17 (@Inevitable_ET) February 10, 2020
Dean Koontz
The Eyes of Darkness
1981
Highlighted in green pic.twitter.com/SrI9RgQsWy
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire