రసాయన శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ పురస్కారం

రసాయన శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ పురస్కారం
x
Highlights

-ముగ్గురు శాస్త్రవేత్తలకు అవార్డు ప్రకటించిన..రాయల్ స్వీడీష్ అకాడెమీ -జాన్ బి. గుడెనఫ్,ఎం.స్టాన్లీ విట్టింగమ్, ఆకిరా మోషివోకు అవార్డులు

రసాయన శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ పురస్కారం దక్కింది. 2019 ఏడాదికి గాను ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్ పురస్కారాన్ని రాయల్ స్వీడీష్ అకాడెమీ బుధవారం నాడు ప్రకటించింది. జాన్ బి. గుడెనఫ్, ఎం.స్టాన్లీ విట్టింగమ్, ఆకిరా మోషివోకు ఈ పురస్కారాన్ని సంయుక్తంగా అందిస్తామని రాయల స్వీడీష్ అకాడమి ప్రకటించింది. లిథియం ఆయాన్ బ్యాటరీ అభివృద్ధి కోసం ఈ ముగ్గురు శాస్త్రవేత్తలు పరిశోధనలు జరిపారు. ప్రతి ఏటా నోబెల్ పురస్కారాలను అందిస్తారు. పలు రంగాల్లో అత్యున్నతమైన నైపుణ్యాన్ని చూపిన వారికి నోబెల్ పురస్కారాలను అందిస్తారు. ఈ ముగ్గురు శాస్త్రవేత్తలూ ప్రస్తుతం వివిధ విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు చేస్తున్నారు. అంతకుముందు ఐదు విభాగాల్లో సాహిత్యం, వైద్యశాస్త్రం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, నోబెల్ పురస్కారం అందించారు.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories