ఇజ్రాయెల్, టర్కీలో కరోనా విజృంభణ..

ఇజ్రాయెల్, టర్కీలో కరోనా విజృంభణ..
x
Highlights

ఇజ్రాయెల్, టర్కీ దేశాల్లో కరోనా మహమ్మారి వ్యాప్తి ఇంకా పెరుగుతూనే ఉంది. ఇజ్రాయెల్ లో 24 గంటల్లో కొత్తగా 106 సంక్రమణ కేసులు ఉన్నాయి. దీంతో కరోనా సోకిన...

ఇజ్రాయెల్, టర్కీ దేశాల్లో కరోనా మహమ్మారి వ్యాప్తి ఇంకా పెరుగుతూనే ఉంది. ఇజ్రాయెల్ లో 24 గంటల్లో కొత్తగా 106 సంక్రమణ కేసులు ఉన్నాయి. దీంతో కరోనా సోకిన వారి సంఖ్య 15834 కు పెరిగింది. ఒకే రోజులో ఐదుగురు వ్యక్తులు సంక్రమణ కారణంగా మరణించారు. అంటువ్యాధి కారణంగా ఇప్పటివరకు 215 మంది మరణించారు. ఇక మే 3 నుంచి దశలవారీగా ఇజ్రాయెల్‌లో విద్యావ్యవస్థ ప్రారంభం కానుంది. ఇదిలావుంటే టర్కీలో కూడా కరోనా మహమ్మారి ఉదృతి కొనసాగుతూనే ఉంది.

ఇక్కడ ఇప్పటివరకు మూడు వేలకు పైగా మరణించారు. 24 గంటల్లో 2936 కొత్త కేసులు నమోదయ్యాయి, 89 మంది మరణించారు. దీంతో దేశంలో వైరస్ సోకిన వారి సంఖ్య లక్ష 17 వేల 589 కు చేరుకుంది. టర్కీ జాతీయ విమానయాన సంస్థ టర్కిష్ ఎయిర్‌లైన్స్ సంక్రమణ కేసులు పెరుగుతున్నందున మే 28 వరకు దేశీయ, అంతర్జాతీయ విమానాలన్నింటినీ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories