Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం ..2 బస్సులు ఢీ..37 మంది దుర్మరణం

Dhivi
Published on: 2 March 2025 6:52 AM IST
Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం ..2 బస్సులు ఢీ..37 మంది దుర్మరణం
X

Road Accident: బొలీవియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బస్సులు ఢీకొన్న ఘటనలో 37 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 39 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను దగ్గరలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు.

బస్సులలో ఒకటి ఎదురుగా ఉన్న లేన్ లోకి దూసుకెళ్లడం వల్లే ఎదురుగా ఉన్న బస్సు ఢీకొందని అధికారులు తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఉప్పునీటి మైదానం అయిన సాలార్ డి ఉయునికి ప్రవేశ ద్వారంగా పిలువబడే ఉయుని ప్రతి సంవత్సరం వేలాది మంది పర్యాటకులను ఆకర్షిస్తుంది.

పోటోసి డిపార్ట్‌మెంటల్ పోలీస్ కమాండ్ ప్రతినిధి మరణాలను ధృవీకరించారు. "ఈ ఘోర ప్రమాదం ఫలితంగా, ఉయుని పట్టణంలోని నాలుగు ఆసుపత్రులలో 39 మంది క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారు. 37 మంది ప్రాణాలు కోల్పోయారు" అని ప్రతినిధి తెలిపారు.

Dhivi

Dhivi

Next Story