సిరియాలో ఘోరం.. బాంబు దాడిలో 40 మంది మృతి

ఉత్తర సిరియా పట్టణమైన ఆఫ్రిన్‌లో మంగళవారం బాంబు పేలింది. దీంతో 11 మంది పిల్లలతో సహా 40 మంది పౌరులు మరణించారు, సమాచారం అందుకున్న భద్రతా సిబ్బంది.

Raj
By Raj
Updated on: 29 April 2020 11:12 AM IST
సిరియాలో ఘోరం.. బాంబు దాడిలో 40 మంది మృతి
X

ఉత్తర సిరియా పట్టణమైన ఆఫ్రిన్‌లో మంగళవారం బాంబు పేలింది. దీంతో 11 మంది పిల్లలతో సహా 40 మంది పౌరులు మరణించారు, సమాచారం అందుకున్న భద్రతా సిబ్బంది. ఘటనా స్థలికి చేరుకొని గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించింది. ఈ విధ్వంసానికి సిరియా కుర్దిష్ వైపిజి మిలీషియా సంస్థ కారణమని టర్కీ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఆఫ్రిన్ కేంద్రంలో రద్దీగా ఉన్న ప్రాంతంలో పేలుడు సంభవించిందని మంత్రిత్వ శాఖ ట్విట్టర్‌లో ఒక ప్రకటనలో తెలిపింది. మంగళవారం ఆలస్యంగా ఈ దాడిని అమెరికా ఖండించింది, ఈ మేరకు విదేశాంగ శాఖ ప్రతినిధి మోర్గాన్ ఓర్టగస్ ఈ దాడిపై ప్రకటన విడుదల చేశారు. సిరియాలో దేశవ్యాప్తంగా కాల్పుల విరమణ కోసం అమెరికా పిలుపునిస్తూ ఒక ప్రకటనలో తెలిపారు. "ఇటువంటి సంఘటనలు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నారు.


Raj

Raj

Next Story