కరోనా 'డేటా' విషయంలో బ్రెజిల్ సంచలన నిర్ణయం

కరోనా డేటా విషయంలో బ్రెజిల్ సంచలన నిర్ణయం
x
Highlights

బ్రెజిల్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి కరోనా కేసులు, మరణాల జాబితాను అధికారికంగా వెల్లడించకూడదని నిర్ణయించుకుంది.

బ్రెజిల్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి కరోనా కేసులు, మరణాల జాబితాను అధికారికంగా వెల్లడించకూడదని నిర్ణయించుకుంది.అందులో భాగంగా శనివారం కరోనాకు సంబంధించిన డేటాను ఓ వెబ్‌సైట్ నుండి తొలగించింది. ఈ వెబ్‌సైట్‌లో, దేశంలో కరోనా సోకిన వారి సంఖ్య, మరణాలు మరియు దాని నుండి కోలుకుంటున్న వారి సంఖ్య నివేదించబడుతున్నాయి,

అంతేకాదు దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కూడా మొత్తం సోకిన వారి సంఖ్యను విడుదల చేయడాన్ని ఆపివేసింది. ఈ నిర్ణయం తీసుకుందో మాత్రం బ్రెజిల్ వెల్లడించలేదు. మరోవైపు బ్రెజిల్ లో కరోనా వ్యాప్తి అంతకంతకూ పెరిగిపోతూనే ఉంది.. ఇప్పటివరకు 6 లక్షలకు పైగా 72 వేల కేసులు నమోదయ్యాయి. గత వారం మాత్రమే, ఇక్కడ మరణాల సంఖ్య 36 వేలు దాటింది, ఇది యుఎస్ కంటే ఎక్కువ.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories