భూటాన్ ప్రభుత్వం భారతీయ పర్యాటకులకు షాక్ ఇచ్చింది. దశాబ్దాలుగా అమలవుతోన్న ఉచిత పర్యాటక ప్రవేశాన్ని రద్దు చేసింది భూటాన్ ప్రభుత్వం.
భూటాన్ ప్రభుత్వం భారతీయ పర్యాటకులకు షాక్ ఇచ్చింది. దశాబ్దాలుగా అమలవుతోన్న ఉచిత పర్యాటక ప్రవేశాన్ని రద్దు చేసింది భూటాన్ ప్రభుత్వం. 2020 జూలై నుండి భారతదేశం, మాల్దీవులు మరియు బంగ్లాదేశ్ నుండి వచ్చే "ప్రాంతీయ పర్యాటకులకు" రోజు రూ.1,200 రుసుమును వసూలు చేయాలని నిర్ణయించింది. ఫీజును సస్టైనబుల్ అని పిలుస్తారని పేర్కొంది. డెవలప్మెంట్ ఫీజు (ఎస్డిఎఫ్)ను.. పర్యాటక రద్దీ కారణంగా పెరుగుతున్న సంఖ్యను మైంటైన్ చేయడానికి ఉపయోగపడుతుందని భావిస్తోంది. అలాగే భూటాన్ ప్రభుత్వానికి సహాయపడటానికి ఉద్దేశించబడిందని పేర్కొంది. ఇందుకోసం నూతన పర్యాటక విధానం అమల్లోకి తీసుకువచ్చింది.
ఈ నిర్ణయాన్ని మంగళవారం జాతీయ అసెంబ్లీ 'భూటాన్ పర్యాటక లెవీ మరియు మినహాయింపు బిల్లు' గా ఆమోదించింది. ఇతర విదేశీ పర్యాటకులకు వసూలు చేసిన $ 65 కన్నా SDF చాలా తక్కువగా ఉంది.. ఈ బిల్లు ప్రకారం ఇతర విదేశీ పర్యాటకులకు తప్పనిసరి ఫ్లాట్ "కవర్ ఛార్జ్" కూడా వసూలు చేయబడుతుంది. అది రోజుకు 250 గా ఉంది.
భారతీయులు ఎక్కువగా అభివృద్ధి చెందిన భూటాన్ పశ్చిమ ప్రాంతానికి వెళుతుంటారు. భూటాన్ యొక్క తూర్పు ప్రాంతంలో పర్యాటకాన్ని ప్రోత్సహించే ప్రయత్నంలో, ట్రోంగ్సా నుండి ట్రాషిగాంగ్ వరకు తూర్పున ఉండే 20 జిల్లాలలోని 11 జిల్లాల్లో పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. ఈ ప్రాంతాలను సందర్శించే పర్యాటకుల కోసం ఎస్డిఎఫ్ ఛార్జీలను తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న భారతదేశం, మాల్దీవులు మరియు బంగ్లాదేశ్ నుండి పిల్లలు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.. అయితే 6 నుండి 12 సంవత్సరాల మధ్య ఉన్నవారు రూ.600 చెల్లించాల్సి ఉంటుంది.
భూటాన్ టూరిజం కౌన్సిల్ డైరెక్టర్ డోర్జీ ధ్రాదుల్ మాట్లాడుతూ.. ప్రాంతీయ పర్యాటకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే ఎస్డిఎఫ్ ఆలోచన అన్నారు.ప్రాంతీయ పర్యాటకులకు ఎస్డిఎఫ్ విధించడం వలన పర్యాటకులకు ప్రత్యేకమైన అనుభవాన్ని కల్పించడంలో సహాయపడుతుంది, ఇది మా పర్యాటక విధానం యొక్క అధిక విలువ, కానీ తక్కువ వాల్యూమ్ అని ధ్రాదుల్ అన్నారు.
అయితే భూటాన్ ప్రభుత్వం తీసుకున్న ఈ విధానం వలన టూర్ ఆపరేటర్లు సంతోషంగా లేరని తెలుస్తోంది.. ప్రాంతీయ టూర్ ఆపరేటర్లు, ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ నుండి, ఎస్డిఎఫ్ సంఖ్యలపై ప్రభావం చూపుతుందని మరియు అక్టోబర్ "పూజా సీజన్" లో భారీ రద్దీని ప్రభావితం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా భూటాన్ విదేశాంగ మంత్రి తాండి డోర్జీ 2019 నవంబర్లో ఢిల్లీ పర్యటన సందర్భంగా విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్తో ఈ ప్రతిపాదనపై చర్చించినట్లు తెలుస్తుంది.
కొత్త నిబంధన అమలులో భారతదేశం నుండి వచ్చే పర్యాటకులు అసౌకర్యానికి గురికారని భూటాన్ అధికారులు హామీ ఇచ్చారని అధికారిక వర్గాలు తెలిపాయి. కొత్త నిబంధనలు 2020 జూలైలో అమల్లోకి రాకముందే భారతదేశంలో నూతన విధానంపై ప్రచారం చేయడానికి ప్రయత్నం చేయాలని భూటాన్ ప్రభుత్వాన్ని సీనియర్ అధికారి కోరారు. ముందుగానే తమ విధానం గురించి భారత్ లో ప్రచారం చేయడం ద్వారా గందరగోళానికి తావు లేకుండా చేసినట్టవుతుందని ఆ అధికారి పేర్కొన్నారు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire