అమెరికాలోని టోర్నెడో బీభత్సం.. ఇప్పటికి 23 మంది మృతి

అమెరికాలోని టోర్నెడో బీభత్సం.. ఇప్పటికి 23 మంది మృతి
x
Highlights

అమెరికాలోని టోర్నెడో బీభత్సం సృష్టించింది. అలబామా రాష్ట్రంలోని ఆగ్నేయ అలబామాలో టోర్నెడో ధాటికి 23 మంది మృతిచెందారు. అంతేకాదు పదుల సంఖ్యలో ప్రజలు...

అమెరికాలోని టోర్నెడో బీభత్సం సృష్టించింది. అలబామా రాష్ట్రంలోని ఆగ్నేయ అలబామాలో టోర్నెడో ధాటికి 23 మంది మృతిచెందారు. అంతేకాదు పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు, పలువురు మహిళలు ఉన్నారు. కాగా తుపాను ధాటికి ఫ్లోరిడా, దక్షిణ కరోలినా, జార్జియా, ప్రాంతాల్లో తీవ్ర నష్టం వాటిల్లినట్టు అధికారులు గుర్తించారు. టోర్నెడో ధాటికి పలు చోట్ల ఇళ్లు నేలకూలాయి. వందల సంఖ్యలో చెట్లు నెలకొరిగాయి. టోర్నెడో కారణంగా గంటకు 170 మైళ్ల వేగంతో గాలులు వీచాయని జాతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. డ్రోన్ల సాయంతో ప్రాణాలతో ఉన్న వారిని గుర్తించి కాపాడుతున్నారు. ఇప్పటికే గాయపడ్డవారిలో చాలా మందిని ఆస్పత్రులకు తరలించారు.

ఇదిలావుంటే టోర్నెడోల ప్రభావం అలబామాలో ఎక్కువగా ఉంటుంది. గతంలో కూడా ఇక్కడ టోర్నెడో ధాటికి చాలామంది ప్రాణాలు కోల్పోయారు. దీనిపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్పందించారు. సహాయక కార్యక్రమాలకు పూర్తి సహకారం అందించాలని అలబామా గవర్నర్‌ ను ఆదేశించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories