పల్లెకోకిల పాటకు చంద్రబాబు ఫిదా

పల్లెకోకిల పాటకు చంద్రబాబు ఫిదా
x
Highlights

అలవోకగా పాటలు పాడుతూ యూట్యూబ్‌లో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న పసల బేబిని సీఎం చంద్రబాబు అభినందించారు. సినీ పాటలతో లక్షలాది మంది అభిమానులను...

అలవోకగా పాటలు పాడుతూ యూట్యూబ్‌లో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న పసల బేబిని సీఎం చంద్రబాబు అభినందించారు. సినీ పాటలతో లక్షలాది మంది అభిమానులను సోషల్ మీడియా ద్వారా మెప్పించడం గొప్ప విషయమని చంద్రబాబు ప్రశంసించారు. అంతేకాదు బేబికి సీఎం సన్మానం కూడా చేశారు. ఈ సందర్భంగా బేబి పాడిన పాటకు చంద్రబాబు ఫిదా అయ్యారు. పల్లెకోయిల బేబిని ఏపీ సీఎం చంద్రబాబు ప్రశంసించారు. ఆమెను ఎంపీ మురళీమోహన్, మహిళా చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి చంద్రబాబుకు పరిచయం చేశారు. బేబి పాడిన పాటకు ఫిదా అయిన చంద్రబాబు.. ఆమెను సన్మానించారు. సినీ పాటలతో లక్షలాది మంది అభిమానులను సోషల్ మీడియా ద్వారా మెప్పించడం గొప్ప విషయమని కొనియాడారు.

సోషల్‌మీడియాలో హల్‌చల్‌ చేస్తున్న సింగర్ బేబి స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలంలోని వడిశలేరు. ఆమె పొలం పనులు చేసేటప్పడు పాడిన పాటలు ఇప్పుడు సంచలనం అయ్యాయి. బేబి పాటలను ఎవరో రికార్డు చేసి సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. సంగీత దర్శకులు ఏఆర్ రెహ్మాన్, కోటి, కీరవాణిలు ఆమెతో పాటలు పాడిస్తామని అంటున్నారు. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి కూడా బేబిని ఇంటికి పిలిచి సత్కారం చేసి, కొంత పారితోషకం కూడా ఇచ్చారు. తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఆమెను ఆశ్వీర్వదించారు. ప్రభుదేవా, నగ్మా నటించిన ప్రేమికుడు సినిమాలోని ‘ఓ చెలియా నా ప్రియసఖియా’ అంటూ ఆమె పాడిన పాటకు లక్షలాది లైక్‌లు, వేల షేర్, కామెంట్స్ వచ్చాయి. పాటలతో లక్షలాది మంది అభిమానులను బేబి సొంతం చేసుకుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories