ప్రతి రైతుకూ రూ.5 లక్షలు

ప్రతి రైతుకూ రూ.5 లక్షలు
x
Highlights

ప్రతి రైతు పేరిటా 5 లక్షల రూపాయల బీమా. కేసీఆర్ ప్రభుత్వం అమలు చేయనున్న కొత్త పథకమిది. రాష్ట్రంలో ఉన్న 72 లక్షల మంది రైతు కుటుంబాలకు బీమా ఫలాన్ని...

ప్రతి రైతు పేరిటా 5 లక్షల రూపాయల బీమా. కేసీఆర్ ప్రభుత్వం అమలు చేయనున్న కొత్త పథకమిది. రాష్ట్రంలో ఉన్న 72 లక్షల మంది రైతు కుటుంబాలకు బీమా ఫలాన్ని అందజేసేందుకు తెలంగాణ ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. రైతు.. ఆత్మహత్య చేసుకుంటేనో, ప్రమాదవశాత్తు మృతిచెందితేనో ఆ కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు 6 లక్షల రూపాయల పరిహారం అందిస్తోంది. కానీ ఇప్పుడు ప్రతీ రైతు మరణానంతరం ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయలు అందేలా ప్రభుత్వం బీమా పథకాన్ని అమలులోకి తెస్తోంది. అంటే రైతు సహజంగా మరణించినా ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయలు అందుతాయన్నమాట.

ఏడాదికి 330 రూపాయల ప్రీమియం చెల్లిస్తే దేశంలో ఎవరికైనా 2 లక్షల రూపాయల బీమాను కేంద్రం అందిస్తోంది. దానికి అదనంగా ఒక్కో రైతు పేరిట మరో 300 రూపాయల ప్రీమియం తెలంగాణ ప్రభుత్వమే చెల్లించి 5 లక్షల రూపాయల బీమా పథకాన్ని అమలులోకి తీసుకొస్తోంది. అంటే రైతు కుటుంబానికి అందే బీమాలో కేంద్రం 2 లక్షల రూపాయలు అందిస్తుండగా, రాష్ట్రం 3 లక్షల రూపాయలు అందిస్తుంది.

ఈ పథకం కోసం 5 వందల కోట్ల రూపాయలు కేటాయించాలని ప్రభుత్వానికి ప్రతిపాదించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ తక్షణమే రైతులకు బీమా కార్డులు అందజేసేందుకు బీమా కంపెనీలతో చర్చలు జరుపుతోంది. ఈ పథకం అమలైతే 6 లక్షల రూపాయల పరిహార పథకాన్ని రద్దు చేయొచ్చని, అలాగే రైతు ఆత్మహత్యలపై దుమారం రేపే విపక్షాలను కట్టడి చేయవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.

ఈ పథకంతో ప్రతి రైతు మరణానంతరం 5 లక్షల రూపాయలు అందిస్తే రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు తగ్గుముఖం పట్టే అవకాశముంది. అలాగే రాష్ట్ర వ్యవసాయ రంగం అభివృద్ధి చెందుతుందని వ్యవసాయ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories