పెద్దాపురం విషాదం..బాణాసంచా బాలుడు మృతి

nanireddy
Updated on: 24 Dec 2018 1:25 PM IST
పెద్దాపురం విషాదం..బాణాసంచా బాలుడు మృతి
X

తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం విషాదం చోటుచేసుకుంది. పట్టణంలోని బ్యాంక్ కాలనీలో ఖాళీ చేసిన బాణాసంచా గోడౌన్లో పేలుడు సంభంవించి ఐదేళ్ల బాలుడు మృతి చెందాడు. మరో బాలికి తీవ్రంగా గాయపడింది. ఖాళీ గోడౌన్‌లో అక్క, తమ్ముళ్లు ఆడుకుంటుండగా.. అందులో వదిలివేయబడ్డ బాణాసంచా ఒక్కసారీగా పేలింది. దీంతో తమ్ముడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. అన్న తీవ్ర గాయాలతో పడిపోయింది. ప్రమాదం జరిగిన చాలా సమయం తర్వాత గమనించిన స్థానికులు బాలికను ఆస్పత్రికి తరలించారు. పేలుడులో బాలుడు మృతి చెందడం, బాలిక గాయపడటంతో వారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

nanireddy

nanireddy

Next Story