మంత్రి జవహర్ ఇంట విషాదం..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎక్సైజ్ శాఖామంత్రి కొత్తపల్లి శామ్యూల్ జవహర్ (కె. ఎస్. జవహర్) ఇంట విషాదం నెలకొంది. పశ్చిమ గోదావరి జిల్లాలో ఉపాధ్యాయురాలిగా సుపరిచితురాలైన జవహర్ తల్లి కె.ఎస్ దానమ్మ(89) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న దానమ్మ గురువారం మృతిచెందారు. ఆమెకు ఏడుగురు సంతానం అందులో ఐదవ సంతానం మంత్రి జవహర్. దానమ్మ మృతి పట్ల పలువురు టీడీపీ నేతలు విచారం వ్యక్తం చేశారు. మంత్రికి సానూభూతి తెలిపారు.
Next Story




