బాబోయ్‌ మళ్లీ పిడుగులట.... వాతావరణం మారిపోతోంది

బాబోయ్‌ మళ్లీ పిడుగులట.... వాతావరణం మారిపోతోంది
x
Highlights

ఉపరితల ద్రోణి ఛత్తీస్‌గడ్‌ నుంచి తెలంగాణ మీదుగా తమిళనాడు వరకు కొనసాగుతోంది. మధ్యప్రదేశ్‌ దిశగా కదులుతున్న ద్రోణి ప్రభావంతో.. కోస్తాంధ్ర, రాయలసీమలో పలు...

ఉపరితల ద్రోణి ఛత్తీస్‌గడ్‌ నుంచి తెలంగాణ మీదుగా తమిళనాడు వరకు కొనసాగుతోంది. మధ్యప్రదేశ్‌ దిశగా కదులుతున్న ద్రోణి ప్రభావంతో.. కోస్తాంధ్ర, రాయలసీమలో పలు చోట్ల వర్షం కురిసే అవకాశం ఉంది. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురవచ్చని అధికారులు తెలిపారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని అధికారుల హెచ్చరించారు. ఉపరితల ఆవర్తనం బెంగాల్ పై కొనసాగుతోంది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో.. తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల భారీ వర్షాలు పడనున్నాయి. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలో పిడుగులు పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ శాశ వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories