పవన్ సమక్షంలో పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే
జనసేన అధినేత పవన్కల్యాణ్ శ్రీకాకుళంలో పార్టీ నాయకులు నాదెండ్ల మనోహర్తోపాటు ఇతర నేతలు, కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విశాఖకు చెందిన పలు పార్టీల నేతలు పవన్ సమక్షంలో జనసేనలో చేరారు. యలమంచిలి నియోజకవర్గానికి చెందిన టీడీపీ నాయకులు సుందరపు విజయ్కుమార్, మాడుగుల మాజీ ఎమ్మెల్యే పూడి మంగపతి, విశాఖ జిల్లా టీడీపీ, వైసీపీ, బీజేపీలకు చెందిన పలువురు ద్వితీయ శ్రేణి నాయకులు జనసేనలో చేరారు. వారందరికీ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు పవన్కల్యాణ్.
Next Story




