ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి!

nanireddy
Updated on: 24 Dec 2018 1:48 PM IST
ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి!
X

కర్నూల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆటో ఆర్టీసీ బస్సు ఒకదానికొకటి ఢీకొట్టుకోవడంతో ప్రమాదం జరిగింది. దీంతో ఏడుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందగా మరో ఐదుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.కాగా మృతులు కర్నూల్ కోడుమూరు మండలం కల్లపాడు గ్రామస్తులుగా గుర్తించారు. వీరు ఆటోలో మహానంది దర్శనానికి వెళుతున్నట్టు సమాచారం. ప్రమాదానికి అతివేగమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

nanireddy

nanireddy

Next Story