నన్ను మళ్లీ విధుల్లోకి తీసుకోండి : రమణ దీక్షితులు

నన్ను మళ్లీ విధుల్లోకి తీసుకోండి : రమణ దీక్షితులు
x
Highlights

హైకోర్టు తీర్పును శిరసావహించి తనను మళ్లీ విధుల్లోకి తీసుకోవాలని శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు టీటీడీ ఈఓ అనిల్‌ కుమార్‌ సింఘల్‌ను...

హైకోర్టు తీర్పును శిరసావహించి తనను మళ్లీ విధుల్లోకి తీసుకోవాలని శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు టీటీడీ ఈఓ అనిల్‌ కుమార్‌ సింఘల్‌ను కోరారు. తిరుచానూర్ మిరాశీ అర్చకులకు హైకోర్టు ఇచ్చిన తీర్పును తనకు వర్తింపచేయాలని ఈఓను అభ్యర్ధించారు. వినతి పత్రాన్ని అందజేశారు. శ్రీవారి ఆలయంలో ఆగమ శాస్త్ర నిబంధనల విషయంలో గతంలో ఏపీ ప్రభుత్వానికి, రమణ దీక్షితులకు మధ్య అభిప్రాయభేదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో 65 ఏళ్లు పూర్తయిన అర్చకులకు విశ్రాంతి ఇవ్వాలనీ, కొత్తవారిని తీసుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) నిర్ణయించింది. ఈ మేరకు పాలకమండలి నిర్ణయం తీసుకోవడంతో గత మే నెలలో రమణ దీక్షితులతో పాటు మరికొందరు అర్చకులను విధుల నుంచి తప్పించారు. దీనిపై రమణ దీక్షితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories