టూర్ షెడ్యూల్ ప్రకటించిన పవన్ కల్యాణ్

టూర్ షెడ్యూల్ ప్రకటించిన పవన్ కల్యాణ్
x
Highlights

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆదివారం మధ్యాహ్నం రాజ‌కీయ యాత్రకు సంబంధించిన పర్యటన వివరాలను ప్రకటించారు. సోమవారం నుంచి తెలంగాణలో పర్యటిస్తున్నట్లు...

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆదివారం మధ్యాహ్నం రాజ‌కీయ యాత్రకు సంబంధించిన పర్యటన వివరాలను ప్రకటించారు. సోమవారం నుంచి తెలంగాణలో పర్యటిస్తున్నట్లు చెప్పారు. నాలుగు రోజుల పాటు మూడు జిల్లాల్లో పర్యటించనున్నారు. ముందుగా రేపు జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకోనున్నారు. దర్శనం తర్వాత తెలంగాణ జిల్లాల్లోని పార్టీ కార్యకర్తలతో పార్టీ సిద్ధాంతాల గురించి చర్చిస్తామన్నారు. సోమవారం ఆంజనేయస్వామిని దర్శించుకున్నతర్వాత పూర్తి యాత్ర వివరాలు వెల్లడిస్తానన్నారు. ఎలాంటి పబ్లిక్‌ మీటింగ్స్‌ ఉండవన్న పవన్‌...కేవలం కార్యకర్తలతో సమావేశాలు మాత్రమే నిర్వహిస్తామన్నారు. ప్రజా సమస్యల అధ్యయనం కోసమే యాత్రకు వెళ్తున్నట్లు పవన్‌ కల్యాణ్ స్పష్టం చేశారు. పాదయాత్రతో ఎక్కువ మంది ప్రజలను కలిసే అవకాశం ఉండదని పవన్‌ తెలిపారు. కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం జిల్లాల్లో బస్సు యాత్ర చేయాలని నిర్ణయించారు జనసేనాని పవన్‌ కల్యాణ్‌.

Show Full Article
Print Article
Next Story
More Stories