దారుణం: సన్యాసినిపై 13సార్లు అత్యాచారం!

దారుణం: సన్యాసినిపై 13సార్లు అత్యాచారం!
x
Highlights

కేరళలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ఓ సన్యాసినిపై మత గురువు పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన బాధితురాలు శుక్రవారం కొట్టాయం జిల్లా ఎస్పీకి...

కేరళలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ఓ సన్యాసినిపై మత గురువు పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన బాధితురాలు శుక్రవారం కొట్టాయం జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది. తనపై ఉత్తర భారతదేశానికి చెందిన డయాసిస్ కేథలిక్ బిషప్ తనపై 13 సార్లు అత్యాచారం చేశాడని కేరళ రాష్ట్రంలోని కొట్టాయం జిల్లాకు చెందిన ఓ నన్ కొట్టాయం జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది. 2014లో అనాథ ఆశ్రమం వద్ద ఉన్న అతిధి గృహంలో బిషప్ తనపై మొదటిసారి అత్యాచారం చేశాడని నన్ పేర్కొంది. బిషప్ నిర్వాకంపై తాను చర్చ్ అథారిటీకి ఫిర్యాదు చేసినా ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని నన్ పోలీసులకు సమర్పించిన ఫిర్యాదులో వెల్లడించింది. కాగా తాను నన్ ను బదిలీ చేశాననే కోపంతో ఇలా ఫిర్యాదు చేసిందని బిషప్ పోలీసులకు కౌంటర్ పిటిషన్ సమర్పించారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపేందుకు డీఎస్పీ నేతృత్వంలో పోలీసుబృందాన్ని నియమించామని కొట్టాయం ఎస్పీ వివరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories