దిగ్విజయ్ పై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ

దిగ్విజయ్ పై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ
x
Highlights

కాంగ్రెస్ జాతీయ నాయకుడు దిగ్విజయ్ సింగ్‌కు నాంపల్లి కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపి అసదుద్దిన్...

కాంగ్రెస్ జాతీయ నాయకుడు దిగ్విజయ్ సింగ్‌కు నాంపల్లి కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపి అసదుద్దిన్ ఓవైసిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో దిగ్విజయ్‌ను అరెస్ట్ చేయాలంటూ కోర్టు పోలీసులను ఆదేశించింది. దీంతో కాంగ్రెస్ పార్టీలో కలకలం రేగింది. ఇటీవల తెలంగాణ ఎన్నికల సందర్భంగా హైదరాబాద్ లో ప్రచారం నిర్వహించిన దిగ్విజయ్ ఎంఐఎం పార్టీ, అసదుద్దిన్ ను ఉద్దేశించి మాట్లాడారు. కేవలం భయపెట్టి డబ్బులు వసూలు చేసుకోడానికే ఎంఐఎం పార్టీని కొన్ని రాష్ట్రాల్లో అసదుద్దిన్ బరిలోకి దింపాడంటూ దిగ్విజయ్ వ్యాఖ్యానించడం తీవ్ర దమారం రేపింది.

Show Full Article
Print Article
Next Story
More Stories