టీడీపీ ఆందోళనపై మండిపడ్డ రోజా

టీడీపీ ఆందోళనపై మండిపడ్డ రోజా
x
Highlights

ఏపీకి అన్యాయం చేశారంటూ కేంద్రం తీరుపై నిరసన వ్యక్తం చేస్తున్న టీడీపీపై వైసీపీ ఎమ్మెల్యే రోజా విమర్శలు గుప్పించారు. పార్లమెంట్ లో టీడీపీ ఎంపీలు...

ఏపీకి అన్యాయం చేశారంటూ కేంద్రం తీరుపై నిరసన వ్యక్తం చేస్తున్న టీడీపీపై వైసీపీ ఎమ్మెల్యే రోజా విమర్శలు గుప్పించారు. పార్లమెంట్ లో టీడీపీ ఎంపీలు చేస్తున్న ఆందోళనను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. కేంద్రం తీరును నిరసిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు..కేంద్రమంత్రులతో రాజీనామా చేయించి ప్రజల్లోకి వచ్చి పోరాటం చేయాలన్నారు. ప్రత్యేక హోదా, కడపలో ఉక్కు ఫ్యాక్టరీ కోసం వైసీపీ నాలుగేళ్లుగా పోరాటం చేస్తుందని గుర్తుచేశారు. ఇప్పుడేమో కొత్తగా వచ్చి పోరాటాలు చేస్తామంటే నమ్మే పరిస్థితుల్లో ఎవరూ లేరని రోజా అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories