ప్రజా తీర్పుకు కర్నాటక ఫలితాలు అద్దం పడుతున్నాయి : ఏపీ మంత్రులు

x
Highlights

కర్నాటక ఫలితాలు ప్రజా తీర్పుకు అద్దం పడుతున్నాయంటున్నారు ఏపీ మంత్రులు. త్వరలో జరగబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లోనూ బీజేపీకి ఇదే ఫలితాలు పునరావృతం...

కర్నాటక ఫలితాలు ప్రజా తీర్పుకు అద్దం పడుతున్నాయంటున్నారు ఏపీ మంత్రులు. త్వరలో జరగబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లోనూ బీజేపీకి ఇదే ఫలితాలు పునరావృతం అవుతాయని మంత్రి ఆది నారాయణ రెడ్డి అన్నారు. బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి అధికారంలోకి రావడం ఖాయమన్నారు. తాజా ఎన్నికల్లో కర్నాటక ప్రజలు బీజేపీని మరోసారి తిరస్కరించారంటూ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఇక వివాదాస్పద ఎంపీ జేసీ మరోసారి ప్రధాని మోదీపై విరుచుకుపడ్డారు. దేశానికి మోదీ ఓ ఫ్యాక్షనిస్టుగా మారాడంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఏపీలో ఎవరితో పొత్తు పెట్టుకోకపోయినా టీడీపీ గెలుస్తుందన్నారు. చంద్రబాబు తన కోసం కాకుండా దేశం కోసం ఆలోచించి కాంగ్రెస్‌తో పొత్తు కుదుర్చుకున్నారంటూ జేసీ సమర్ధించుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories