మంత్రి నారా లోకేష్ కు అరుదైన గౌరవం

nanireddy
Updated on: 28 Dec 2018 12:16 PM IST
మంత్రి నారా లోకేష్ కు అరుదైన గౌరవం
X

ఆంధ్రప్రదేశ్ ఐటీ, పంచాయతీ రాజ్ మంత్రి నారా లోకేష్ సింగపూర్‌లో పర్యటిస్తున్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా సింగపూర్ చేరుకున్న లోకేష్‌కు ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం లభించింది. సింగపూర్ ప్రభుత్వం నుంచి అరుదైన గౌరవం లభించింది. ఆ దేశ 6వ అధ్యక్షుడైన ఎస్‌ఆర్‌ నాథన్‌ సేవల్ని స్మరిస్తూ ఇచ్చే ఫెలోషిప్‌ను ఈసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ శాఖా మంత్రి నారా లోకేష్‌కి ప్రదానం చేస్తున్నారు. దీన్ని అందుకునేందుకు రావాలంటూ లోకేష్‌కు.. సింగపూర్ విదేశాంగ మంత్రి వివియన్ బాలకృష్ణన్ నుంచి ఆహ్వానం అందింది. దాంతో ఆయన సింగపూర్ వెళ్లారు. పనిలో పనిగా పెట్టుబడులను ఆకర్షించేందుకు పలు కంపీనీల ప్రతినిధులతో లోకేష్ సమావేశం కానున్నట్టు సమాచారం.

nanireddy

nanireddy

Next Story