కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు...ఎర్రబెల్లి కోసం జూపల్లిని...

కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు...ఎర్రబెల్లి కోసం జూపల్లిని...
x
Highlights

మాజీ మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎర్రబెల్లి దయాకర్ రావును మంత్రి వర్గంలో తీసుకోవాలనే ఉద్దేశంతో జూపల్లిని ఓడించారంటూ ఆరోపించారు....

మాజీ మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎర్రబెల్లి దయాకర్ రావును మంత్రి వర్గంలో తీసుకోవాలనే ఉద్దేశంతో జూపల్లిని ఓడించారంటూ ఆరోపించారు. ప్రశ్నించే వారిని అసెంబ్లీ రాకుండా చేసేందుకు కోట్లాది రూపాయలు ఖర్చు చేశారని కొండా సురేఖ విమర్శించారు. తనను ఓడించడానికి 50 కోట్ల రూపాయలు ఖర్చు చేశారంటూ సురేఖ ఆరోపించారు. అధికార దుర్వినియోగంతోనే ముందస్తు ఎన్నికల్లో టీఆర్ఎస్‌ గెలిచిందన్నారు. కేసీఆర్ ఇచ్చిన భీ ఫాం మీద తన భర్త కొండా మురళి గెలవకపోయినా టీఆర్ఎస్ నేతలు తమ పదవని అనుకోవడం వల్లే రాజీనామా చేసినట్టు ప్రకటించారు. ప్రజల ఆశీర్వాదంతోనే తమకు పదవులు వచ్చాయన్న ఆమె సీఎం కేసీఆర్ ఇప్పటికైనా కుటుంబ పెత్తనాన్ని ప్రజా సంక్షేమంపై దృష్టి పెట్టాలని సూచించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories