తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా మంది సినీ నటులు రాజకీయాల్లో యాక్టివ్గా ఉంటున్నారు. రాజకీయనాయకులపై విమర్శలు చేస్తూ తమ వాయిస్ ను వినిపిస్తున్నారు....
తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా మంది సినీ నటులు రాజకీయాల్లో యాక్టివ్గా ఉంటున్నారు. రాజకీయనాయకులపై విమర్శలు చేస్తూ తమ వాయిస్ ను వినిపిస్తున్నారు. ఇలాంటి వారిని ఉద్దేశిస్తూ ప్రముఖ రచయిత కోన వెంకట్ ఆసక్తికర ట్వీట్ చేశాడు. కొంతమంది సినీ నటులు నిజమైన రాజకీయ నాయకులను విమర్శిస్తున్నారని అది మంచి పద్ధతి కాదని వెంకట్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం కోన వెంకట్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ప్రత్యేక హోదా నేపథ్యంలో సినీ రంగానికి చెందిన కొందరు వ్యక్తులు కొద్ది రోజులుగా రకరకాల విమర్శలు గుప్పిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కోన వెంకట్ ....వారిని టార్గెట్ చేస్తూ షాకింగ్ ట్వీట్ చేశారు. ``ఇండస్ట్రీకి చెందిన కొంతమంది నటులు.....సినిమాటిక్ గా - స్టుపిడ్ గా ఉండే పొలిటికల్ థీయరీస్ ను ప్రచారం చేస్తున్నారు. వారు చేస్తున్న విమర్శలు....వారి ఆలోచనా విధానం ప్రాక్టికల్ గా ఉంటే అభినందించేవాడిని. నిజమైన నిజాయితీగల రాజకీయ నాయకులను విమర్శించడం మానేసి... ప్రజలు - వారి సమస్యలపై దృష్టి సారించండి బ్రదర్స్`` అని కోన ట్వీట్ చేశారు. అయితే పవన్ పై హీరో శివాజీ చేస్తోన్న కామెంట్లనుద్దేశించి కోన ఈ ట్వీట్ చేశారని సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. పవన్ కు బాసటగానే కోన ఈ వ్యాఖ్యలు చేశారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
Some actors from r film industry, started speculating some political theories which are sounding very cinematic and stupid... I appreciate them if they r more practical in their thinking... Instead of attacking geniune leaders, Pl focus on people and their problems brother !!
— kona venkat (@konavenkat99) March 24, 2018
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire